Tuesday 29 September 2020

స్వామి వారి అమృత వచనాలు - గణపతి (39)


అచరూప్పాక్కం అనే నగరం చెంగల్పట్టునకు, తిండివనానికి మధ్యలో ఉంది. ఇక్కడే ఈశ్వరుని రథం విరిగిందని, కదలలేదని అంటారు. అచ్చు అంటే ఇరుసు - ఆరు అంటే విరిగింది, పొత్తం అంటే ప్రదేశం. 


ఇటీవల ఒక చిత్రమైన సంఘటన పురాణ కథను గుర్తు చేసింది. రామేశ్వరం దగ్గర మేము శంకరమఠాన్ని నిర్మించాలని అనుకున్నాం. జైపూర్ నుండి చలువరాయిని తెప్పించాం. కాంచీపురంలో శంకరుల విగ్రహం, నల్గురు శిష్యుల విగ్రహాలను చెక్కారు. ఒక వాహనం పై వీటిని రామేశ్వరం తీసుకొని వెళ్ళాలి. దారిలో సరిగ్గా అచరూప్పాక్కం దగ్గర వాహనం అగిపోయింది. కదలడం లేదు. 108 కొబ్బరికాయలు కొట్టి వాహనాన్ని బాగుచేయగా బండి బాగుపడింది. ఇక ఆటంకాలు లేకుండా తిన్నగా రామేశ్వరం వచ్చింది. ఆ శంకరుని రథం అప్పుడు కదలలేదు. శంకర భగవత్పాదులను తీసుకొని వెళ్ళే ఈ ఆధునిక వాహనానికీ ఆటంకం ఏర్పడింది. ఈయనా ఆగిపోయారు. చిత్రంగా ఉంది కదూ!

No comments:

Post a Comment