Wednesday 23 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (33)


ఇక చతుర్భజం, నాల్గు చేతులున్నవాడు. ఇంచుమించు అందరి దేవతలకు నాల్గు చేతులుంటాయి. కనుక ఈ పదమూ ప్రత్యేకంగా ఇతణ్ణి చూపించడం లేదు.


ప్రసన్నవదనం ప్రసన్నమైన ముఖం కలవాడు, ఇట్లా దీనికి విరుద్ధంగా ఏ దేవతను కీర్తిస్తామా? కాళి, నరసింహ, వీరభద్రులు మాత్రం భయంకరంగా ఉంటారు గాని అందరు దేవతలు ప్రసన్నంగానే ఉంటారు కదా. భక్తులను అనుగ్రహిస్తున్నట్లు వారి విగ్రహాలుంటాయి. ఈ విశాలమైన గజపదనం కూడా అట్లా ఉందనుకుందాం.


కనుక శ్లోకంలోని ఐదు పదాలు వినాయకుని ప్రత్యేకంగా పేర్కొనలేదు ఈ పదాల ఉచ్చరిస్తూ కణతలను భక్తులు తాకుతారు.


ధ్యాయేత్, ధ్యానం చేయవలసినది. దేనికి ధ్యానం చేయాలి? సర్వ విఘ్న ఉపశాంతయే, విఘ్నాలు తొలగడం కోసం. ఇదిగో ఇక్కడ స్వామి ప్రసక్తి వస్తుంది, ప్రత్యేకంగా విఘ్నేశ్వరుడు పేర్కొనకపోయినా, ఏ ఆటంకాలు లేకుండా ఉండాలంటే ఈ స్వామినే, పూజించాలి. కనీసం ఈ శ్లోకాన్నైనా చదివి చేతులతో కణతల నానించాలి. 


No comments:

Post a Comment