Friday 4 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (14)



వినాయకుని గుర్తు


తమిళులు వ్రాయడానికి మొదలు పెట్టినప్పుడు వినాయకుని గుర్తు ఉంచుతారు. ఏదో గ్రంథ రచనకే కాదు, చిన్న ఉత్తరం ముక్క వ్రాయాలన్నా ఈ గుర్తు నుంచుతారు (తెలుగువారు శ్రీరామ అని వ్రాసినట్లుగా) అంతేకాదు, ఏ పని మొదలు పెట్టినా వినాయకున్ని అందరూ స్మరిస్తారు. విఘ్నాలు లేకుండా ఉండడం కోసం.


ఈ పై గుర్తు ఎట్లా ఉంటుంది? అర్ధ చంద్రాకారం, అంటే దానర్థం మన వ్రాతసున్నాతో ముగియకూడదనే.


ఓంకారం వ్రాస్తే నాగరిలిపిలో 'ఓ' తరువాత అర్ధ చంద్రాకారం గుర్తు ఉంటుంది కదా. తమిళంలోనైనా గ్రంథ లిపిలో వ్రాసినా అంతే. అసలు ప్రణవమే వినాయకుని నుండి వచ్చింది కదా! 


ఓం' దేవ నాగరిలిపిలో 'ఊ వ్రాసిన తరువాత వక్రంగా ఒక గీత గీసి దానిపై అర్ధచంద్రాకారం ఉంటుంది. ఏనుగు తుండమూ వక్రంగానే ఉంటుంది అందువల్ల అతడు వక్రతుండుడు. వంకర ను సూచించడాన్ని పూర్తి చేస్తే నిండు సున్నగా కన్పిస్తుంది. అంటే ఈ ప్రపంచము, మిగతా లోకాలు నక్షత్రాలు, మొత్తం బ్రహ్మాండం అంటే గుండ్రంగానే ఉంటుంది. అండం అనగా గ్రుడ్డు, గుండ్రంగానే ఉంటుంది. అంటే బ్రహ్మాండమూ గ్రుడ్డు.

1 comment: