Sunday 20 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (30)

ఇక సుబ్రహ్మణ్యునకు, అతని మేనమామకు దగ్గర సంబంధం ఉంది. కుమారస్వామిని తమిళంలో మురుగన్ అని అంటారు. మురుగన్ ని చెప్పినపుడు మాల్ మురుగన్ తోనే ఉంటుంది. మరుగన్ అనే పదం మరుమగన్ (అల్లుడు) నుండి వచ్చింది. మరుమగన్ అనగా మేనల్లుడు. దక్షిణ దేశంలో మేనమామ కూతుర్ని వివాహం చేసుకోవడం ఆచారం కనుక మరుమాన్ అనే పదం అల్లుణ్ణి సూచిస్తుంది.

విష్ణువు - అమ్మవారు

అమ్మవారి సోదరుడే మహావిష్ణువు. ఆమెకు నారాయణ సహోదరి అని ఒక నామం. అమ్మవారు దాక్షాయణిగా, పార్వతిగా, మీనాక్షిగా అవతరించినపుడు విష్ణువు సోదరునిగా అవతార మెత్తలేదు. ఒక్క కృష్ణావతారంలోనే అన్న చెల్లెలుగా కనబడ్డారు. స్వామి దేవకీ వసుదేవుల బిడ్డ గా నుండగా నందగోపుడు యశోద యొక్క తనయగా అమ్మవారవతరించింది. కృష్ణుడవతరించినప్పుడు జగత్తంతా అంధకారంతో ఉండగా వాసుదేవుడు కృష్ణుణ్ణి నందుని ఇంటికి తీసుకొని వెళ్ళడం, యశోద ప్రక్కలో నున్న అమ్మవారిని తీసుకొని తిరిగి రావడం తెలిసిందే కదా. 

వాసుదేవుని కూతురుగా కంసుడు ఆమెను భావించి సంహరించడానికి పూనుకొనగా ఆమె అకాశంలో ఎగిరి నిజరూపాన్ని ధరించి నిన్ను చంపబోయేవాడున్నాడని ఆంతర్జానమైంది.


No comments:

Post a Comment