Monday 28 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (38)


కొడుకే - తండ్రి నుండి పూజలందుకొనుట 


ఈశ్వరుడు, త్రిపురాసురులను జయించే సందర్భంలో అతని కొడుకును ధ్యానించలేదట. కొడుకు యొక్క గొప్పదనాన్ని గుర్తించలేదట. 


తనకు రావలసిన బాకీని గణపతి వదులుకుంటాడా? అందరు దేవతలు, ముందుగా గణపతిని పూజించాలన్నారు. శివుడు, దానిని దాటడానికి వీలు లేదు. పూజించకుండా ఈశ్వరుని రథం బయలుదేరబోతోంది. ఇరుసు విరిగి పోవుగాక అని గణపతి యనగా విరిగింది. ఇక రథమెట్లా కదులుతుంది?


అరెరె! నియమాన్ని అతిక్రమించాను, నేనేమో అందరికంటే పెద్దయని భావించాను. నియమాలను పాటించడంలో వ్యక్తిగతమైన గొప్పదనం పోకూడదని శివుడు గణపతిని పూజించాడట. (మరొక సందర్భంలో కనిష్ఠ పుత్రుడైన కుమారస్వామికే నమస్కరించి శివుడు ప్రణవోపదేశాన్ని పొందినట్లుంది కూడా).


వెంటనే ఆటంకాన్ని తొలగించాడు వినాయకుడు. రథం కదిలింది త్రిపురాసురులను జయించాడు, శంకరుడు. త్రిపురాంతకుడనే బిరుదు వహించాడు.


No comments:

Post a Comment