Saturday 1 January 2022

శ్రీ హనుమద్భాగవతము (119)



చివరకు రావణుకు మేఘములను లంకానగరముపై వర్షింపవలసినదిగా ఆజ్ఞాపించాడు. మేఘములు గుంపులు గుంపులుగా వెడలి మండుచున్న లంక పై జేరి ఘోరముగా వర్షింపనారంభించెను, కాని శ్రీహనుమంతుడు రగిల్చిన అగ్ని జ్వాలలా వర్షముచే మరింతగా ప్రజ్వరిల్ల నారంభించెను. జలధారలు ఘృతమువలె ఆ అగ్నికి సహాయమొనరించెను.


విచిత్రమైనదశ. మేఘము లెంతగ వర్షించినా ఈ విపరీతమైన పరిణామమును గాంచి అవి శుష్కములై ఇట్లు ఆక్రందనలు చేయుట ఆరంభించెను.


దోహా 

ఇహా జ్వాల జరే జాత

సూఖే సకుచాత సబ, కహత పుకార హై| 

జుగ షట భాను దేఖే, ప్రళయ కృసాను దేఖే. 

శేషముఖ అనల విలోక బార బార హై

‘తులసీ' సున్యో న కాన సలిలు సర్పీ సమాన, 

అతి అచిరిజు కియో కేసరీకుమార హై| 

బారిద బచన సుని ధున సాస సచివణ  

క హై దససీస! ‘ఈస బామతా వికార హై'॥


(కవితావళి 5–20)


మేము ద్వాదశసూర్యులను చూచితిమి, ప్రళయాగ్నిని దర్శించితిమి. ఎన్నో పర్యాయములు ఆదిశేషుని ముఖమునుండి బయలెవెడలు జ్వాలలను కూడా గాంచితిమి. కాని జలములు ఘృతమువలె పరిణామము చెంది అగ్నిని ప్రజ్వరిల్ల జేయుట మెపుడును గాంచలేదు, వినలేదు. ఆశ్చర్యకరమైన విషయమును శ్రీ కేసరీనందనుడు మాత్రమే చేసి చూపించెను.


మేఘములు వచనములను ఆలకించి రావణుని మంత్రులు తలలు త్రిప్పినవారై అతనితో ఇట్లు పలికారు. ఇది అంతయూ ఈశ్వరుని ఎడల ప్రతికూలతకు ఫలము.


No comments:

Post a Comment