Monday 3 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 210 వ భాగం

 


వాది ప్రతివాదులు కలహించుకుంటూ ఉంటారు. కాని సాక్షి మాత్రం చూస్తూ ఉంటాడు. అట్లా ఇంద్రియాలు, మనసు సంఘర్షణ పడుతున్నా నేను మాత్రం సాక్షిని, చైతన్యాన్ని, ఆత్మయే నేను. మిగతాదంతా బాహ్యమైనది. ఇంద్రియాలు, అంతఃకరణలు చూడబడేవి. చూచేది ఆత్మయే. ఆ ఆత్మయే నేను. ఇది మొదటి శ్లోకం. ఇక చివరి దానిని చెబుతాను.


యత్ సౌఖ్యాంబుధి లేక లేక ఇమేశ క్రాదయోనిర్వృతా

యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా మునిర్నిర్హృతః

యస్మిన్నిత్య సుధాంబుధౌ గలితధీః బ్రహ్మైవన బ్రహ్మవిత్

యః కశ్చిత్ స సురేంద్ర వందిత పదో నూనం మనీషా మమ


ఏ సుఖ సముద్ర కణలేశాన్ని పొంది ఇంద్రాది దేవతలు, ఆనందంలో మునిగిపోయారో, ప్రశాంతచిత్తుడైన ముని, తన చిత్తంలో దేనిని పొంది ఆనందిస్తున్నాదో, ఆ నిత్య అమృత సముద్రంలో ఎవని చిత్తం కరిగి పోయిందో అతడు బ్రహ్మవేత్తే కాదు, బ్రహ్మమే. అట్టి మహాత్ముని పాదాలకు ఇంద్రుడు కూడా నమస్కరిస్తున్నాడని నా నిశ్చితాభిప్రాయం.


పంచముడు ఆనందాంబుధి యన్నాడు. శంకరులు సుధాంబుధియన్నారు. గురువు చెప్పినది శిష్యుడనాలి కదా! అతని మాటలనే ఉట్టంకించారు. ఇంద్ర భోగాలు కూడా ఆనంద సముద్రంలో ఒక కణం వంటివి. లేశమనే మాటలతో దానిని సూచించారు.


లలిత సహస్ర నామాలలో అమ్మవారు "స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః" అనగా బ్రహ్మాదిల దేవత ఆనందం, ఆమె ఆత్మానందంలో ఒక చుక్క వంటిదే.

No comments:

Post a Comment