Wednesday 26 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 232 వ భాగం



ఇంతలో తోటకుడు, నృత్యం చేస్తూ, శంకరులపై స్తోత్రం చేస్తూ వచ్చాడు. అప్రయత్నంగానే అతని నోటివెంట శ్లోకాలు వచ్చాయి. అవి తోటక ఛందస్సులో ఉన్నాయి. అవి ఎనిమిది శ్లోకాలు. దానినే తోటకాష్టకమని అంటారు. అందువల్ల ఇతడు తోటకాచార్యుడయ్యాడు.


అందొక శ్లోకాన్ని పేర్కొంటా. ఇతడు చెప్పినదాని కంటె ప్రత్యేకంగా నేను చెప్పేదేమీ లేదు. ఈ మధుర శ్లోకాన్ని అందరూ ఆస్వాదింతురుగాక. ఇది భక్తితో కూడినది, మనోల్లాసాన్ని కల్గిస్తుంది.


"జగతీమవతుం కలితా కృతయో 

విచరంతి మహామహసః ఛలతః 

అహిమాం శురివాత్ర విభాసి గురో 

భవ శంకరదేశిక మే శరణం"


మహామహన్ అనగా పెద్ద జ్యోతి, అది అందరినీ అనుగ్రహిస్తుంది. చెడ్డ దారిలో జనులు వెళ్ళకుండా అట్టి జ్యోతిస్సులు మానవాకారం ధరించి యుంటాయి. కనుక మహాన్. ఛలతః = ఒక మిషతో నిజరూపాన్ని కప్పుకొని వస్తారు. అట్టివారు మానవాకారంలో రావడం మనలను మోసగించడం కాదా? అసలు వారికీ వేషంతో పనేమి? తీర్ధయాత్రలవల్ల వారికేమి లాభం? అయినా చేస్తారు. ఇదంతా ప్రజలకు మోసంగా కనబడడం లేదా?


వారు నక్షత్రాలు, గ్రహాలూ తిరుగుతున్నట్లుగా తిరుగుతూ ఉంటారు. అయితే సూర్యుడుదయిస్తే నక్షత్రాల కాంతి వెలవెలబోవడం లేదా? అట్లా వెలవెల పోకుండా వెలిగే వాటిల్లో మీరు సూర్యుని వంటివారని పొగడ్త. 


No comments:

Post a Comment