Tuesday 25 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 231 వ భాగం



తోటకుడు గురుభక్తి


భావాద్వైతం కాని, క్రియాద్వైతం కాదని శంకరులన్నారు. అయితే ప్రతిదానిపట్లా భావాద్వైతం కుదరదు. ఎక్కడ? "అద్వైతం త్రిములోకేషు" అని ఉంది. మూడు భువనాలలోనూ భావాద్వైతం ఉండాలి. అయితే గురువు పట్ల మాత్రం తానూ, గురువూ ఒకటని భావించకూడదు.


"నాద్వైతం గురుణా సహ" (న+అద్వైతం=నాద్వైతం)


తానూ, భగవానుడూ ఒక్కటే అనుకోవచ్చు. అంతేనే కాని, నేనూ, గురువూ ఒకటని భావించకూడదు. గురువుని తనకంటే భిన్నంగా, గొప్పగా చూడాలి. గురువుతో ఇట్లా అనాలని అమ్మవారే చెప్పింది. మీరు వేరు, నేను వేరు, మీరు పాలకులు, నేను సేవకుణ్ణి, మీరు సముద్రం- నేనొక నీటి బిందువును అని అతణ్ణి సేవించాలని ఉంది.


తోటకునికి తల్లిదండ్రులు ఆ పేరు పెట్టలేదు. ఇతని అసలు పేరు ఆనందగిరి. పైకి మూర్ఖునిలా కనబడేవాడు. శంకరుల చుట్టూ ఆరువేల మంది శిష్యులుండేవారు. వారికి పాఠాలను చెబుతూ ఉండేవారు. శిష్యులు చాలా తెలివైనవారు. ఆచార్యులు చెప్పింది శ్రద్ధగా విని అపుడపుడు సందేహ నివృత్తి చేసుకునేవారు. ఇతడేనాడూ గురువుని సందేహాలు అడుగలేదు. అందుచేత ఇతనిని మందబుద్ధిగా మిగతా శిష్యులు భావించారు. ఒకనాడు ఇతడు పాఠానికి రావడం ఆలస్యమైంది. శంకరులు ఏడితడని ప్రశ్నించారు. అతని కోసం వేచియుండడం దండుగని, వచ్చినా, రాకపోయినా ఒక్కటే అని మిగిలిన శిష్యులు అన్నారు.


శిష్యులలో గర్వం పనికిరాదని, వారికొక గుణపాఠం చెప్పాలనుకున్నారు. ఆపైన ఇతనిపై వారికొక అపారమైన దయ యుండేది.


No comments:

Post a Comment