Wednesday 12 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 219 వ భాగం



కుమారిలుడు శాంతించాడు. వీరి మాటలు, వీరి దర్శనం వల్ల, అతని తాపం తగ్గింది. అప్పర్ స్వామిని ఒక సున్నపు బట్టీలో శత్రువులు తోసివేస్తే ఈశ్వర పాదాలను ఆశ్రయించిన నాకు చల్లగా ఉందని అనలేదా? ఆ పాదాలే శంకరుల పాదాలు.


నేనెందుకు జ్ఞానమార్గాన్ని ఖండించానో మీకు తెలుసు. కర్మలను తుంగలో త్రొక్కిన బౌద్ధుల నెదిరించడం కోసం, కర్మ మార్గానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చాను. నేనీ ప్రాయశ్చిత్త కర్మ చేసుకునేటపుడు, ఫలదాతయైన శంకరుడే వచ్చాడని భావిస్తున్నా. అయితే నా శిష్యుడు మీమాంసను బాగా వ్యాప్తి చేసి యజ్ఞ యాగాలను చేసినవాడు, మాహిష్మతీ నగరంలో ఉన్నాడు. అతణ్ణి నివృత్తి మార్గంలో త్రిప్పగలిగితే దిగ్విజయయాత్ర సఫలమౌతుందని కుమారిలుడన్నారు.


(హస్తినా పూర్ దగ్గరగా నున్న విద్యాలయంలో మండనుడున్నాడని కొందరు, మరొక చోటని కొందరు చెబుతారు. ఇతని శిష్యుడని కొందరు, బావ మఱది అని కొందరు వ్రాసేరు. వాటికేమి గాని, అందరూ అతడు మీమాంసకుడని అన్నారు అనువక్త).


సీతాదేవి ఆశీస్సులవల్ల హనుమంతుని తోకకు నిప్పంటించినా ఎట్లా చల్లగా ఉందో, శంకరుల సమక్షంలో కుమారిలుడంత చల్లదనాన్ని పొందాడు. అగ్ని రూపుడైన ఎవడు పరమశివుని నేత్రాగ్నినుండి సుబ్రహ్మణ్యుడై కుమారిలుడుగా అవతరించాడో, ఆ అవతారం ఆ అగ్నిలోనే లీనమై పోయింది. ధర్మశాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి చూపించాడు. అట్టివారే మన మతానికి పునాదులని మరువకండి.


No comments:

Post a Comment