Friday 21 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 228 వ భాగం



పద్మపాదుని పంచపాదిక


ఇతడు శంకరుల శారీరక భాష్యంపై వివరిస్తూ పంచపాదికను వ్రాసి తీర్థయాత్రలు చేస్తూ రామేశ్వరానికి చేరుకున్నారు. తనతో బాటు తన గ్రంథాన్ని తీసుకొని వెళ్ళాడు. యాత్రలో జంబుకేశ్వరంలో అతని మేనమామ ఇంట్లో బస చేసాడు. అక్కడ పుస్తకాన్నుంచి తిరిగి వచ్చేటపుడు తీసుకుందామని భావించాడు. ఇతడు లేనపుడు ఇతని మేనమామ ఈ గ్రంథాన్ని చదివి, తాను గొప్ప మీమాంసకుడవడం వల్ల తన సిద్ధాంతానికి ఈ పుస్తకం చేటు తీసుకొని వస్తుందని తనకున్న రెండు ఇండ్లల్లోని పాడైపోయిన ఇంటిలో దీనినుంచి ఇంటిని తగులబెట్టాడు. (తిరిగి వచ్చి మరల వ్రాయకుండా ఉండడం కోసం మేనమామ ఇతనికి విషం ఇచ్చాడనే కథ కూడా కొన్ని శంకర విజయాలలో ఉంది.)


పద్మపాదుడు తిరిగి వచ్చాడు. తీరా చూస్తే పుస్తకం కాలిపోయింది. '


ఇదంతా సురేశ్వరులను శంకించడం వల్ల శంకరులీ శిక్షను వేసారేమో! జరిగిన కథను శంకరులకు నివేదించాడు.


నీవింతవరకూ మొదటి అధ్యాయంలోని నాల్గు భాగాలను, రెండవ అధ్యాయంలోని మొదటి భాగాన్ని వినిపించావు. అది నాకు గుర్తుంది. తిరిగి వ్రాసుకో, దీనినే ప్రచారం చేయమని అన్నారు. విన్నదంతా తిరిగి చెప్పారు. వారి స్మరణ శక్తి ఎట్టిదో కదా!


సూత్రభాష్యం యొక్క మొదటి ఐదు భాగాలకు ఇది భాష్యం కనుక దీనికి పంచపాదిక అనే మాట వచ్చింది. బ్రహ్మ సూత్రాలలో మొదటి అధ్యాయానికి చెందిన నాల్గు సూత్రాలకే ఇతని వ్యాఖ్యానం మిగిలింది.


ఇతణ్ణి పీఠాధిపతిగా నియమించి యుంటారు. కొందరు ద్వారక మఠానికని, మరికొందరు పూరీ జగన్నాథ మఠానికని అనగా, మార్కండేయ సంహితలో ఆనందగిరీయంలో శృంగేరి మఠానికి ఆచార్యునిగా నియమించినట్లుంది.


No comments:

Post a Comment