Friday 7 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 214 వ భాగం



"పతన్ పతన్ సౌధత లాన్యరో రుహం

యది ప్రమాణం ప్రుతయో భవంతి 

జీవేయేమస్మిన్ పతితో సమస్ధలే 

మజ్జీవనే తచ్ఛృతి మాన్యతా గతిః"


అంత ఎత్తునుండి కింద పడినపుడు బ్రతికాడు కానీ కంటికి గాయం అయింది. ఎందుకిట్లో జరిగిందని కోపగించాడట. వేదాలే ప్రమాణమైతే అని శంకించావు. కిందపడి చనిపోలేదు. కాని కంటికి గాయం అయింది. నీలో సందేహం ఉంది కనుక ఇట్లా జరిగిందని అశరీరవాణి వినబడిందట.


విద్యాశాలలో తాను బౌద్ధుడనని గురువులను నమ్మించి మోసం చేసానని, అనగా గురు ద్రోహం చేసానని, దానికి తగిన ప్రాయశ్చిత్తం మండుతున్న ఊకలో పడి మరణించడమే మేలనుకొని అట్లా చేస్తున్న సమయంలో శంకరులు వెళ్ళారు. 


వీరి దర్శనం వల్ల ఆ మంటలో చల్లదనం అలముకుంది. అంతేకాదు వీరు జ్ఞానామృతాన్ని పంచి పెట్టారు, వెదజల్లారు కూడా. 


No comments:

Post a Comment