Friday 14 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 221 వ భాగం



సరియైన జ్ఞానాన్ని 'ప్రమ' అని అంటారు. తప్పైన జ్ఞానాన్ని 'భ్రమ' అని అంటారు. భ్రమ తప్పైనా ఆ సమయంలో అది నిజమే అనిపిస్తుంది. ప్రమాణంగా కన్పిస్తుంది. కాని ఆలోచిస్తే అది భ్రమ అని తెలిసి అప్రమాణమై పోతుంది.


ఒక వస్తువు కనబడితే ఇది తప్పా? లేక ఒప్పా అని తెలుస్తుంది. రెండు భిన్న వస్తువులను చూసినపుడు అది వేరు, ఇది వేరని మొదట కలుగుతుంది. వెంటనే అది నిజం అనే మరొక జ్ఞానం కలుగుతోంది. ఒక చెట్టును చూసాం. ఇది చెట్టే, నిజం అనే రెండవ జ్ఞానం కల్గుతోంది. ఈ రెండవ జ్ఞానానికి చెట్టును చూడడం కారణమా? లేక మరొక దానివల్ల ఇది కల్గుతోందా? చెట్టును చూడడమే రెండవ జ్ఞానానికి కారణమనేవారు స్వతః ప్రమాణవాదులు, అట్లా కాదు. వేరొక దాని వల్ల ఈ రెండవ జ్ఞానం ఏర్పడుతుందని చెప్పేవారు. పరతః ప్రమాణవాదులని సారాంశం.


(ఒక జ్ఞానం యొక్క యథార్ధాన్ని రుజువు పరచడానికి పర ప్రమాణం కావలసి వస్తుందని ఇది అంతు పట్టదని మీమాంసకులు లేవనెత్తి వేదం యొక్క ప్రామాణాన్ని సాధించడం కోసం ఈ చర్చ సాగింది. శబ్దం, స్వతః ప్రమాణమైతే శబ్ద రూపమైన వేదం యొక్క ప్రామాణికతను ప్రశ్నింపతగదని; శబ్దం పరతః ప్రమాణమైతే వేదాలయొక్క ప్రామాణ్యాన్ని సాధించడం కోసం ఈశ్వరుడు వీటి కర్తయని చెప్పాలని, రెండు వాదాలు. మొదట దీనిని స్థాపించినవారు మీమాంసకులు. వేదం తనంతట తానే ప్రమాణమనేవారు. ఈశ్వరుడు కర్త అవడం వల్ల ఇవి ప్రమాణములని చెప్పేది నైయీయికమతం - అనువక్త)


మండనులను, సరసవాణిని ఓడించుట


కుమారిలుడు ప్రతివాదులను గౌరవించునట్లుగా మండనుడు స్వాగతం పలుకలేదు. అసలు సన్న్యాసులంటే ఇష్టపడడు. వారు వేద కర్మలను విడిచారని కోపం. వీరిని చూడడమే పాపమని భావించేవాడు. పిలువకుండా శంకరులు అతని ఇంటికి వెళ్ళారు. ఆనాడతని ఇంట్లో శ్రాద్ధకర్మ, ఆనాడు సన్యాసులను చూడడం మహాపాపమని భావించాడు. ఇంటి తలుపులు మూసేసి యున్నాయి.


No comments:

Post a Comment