Thursday 20 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 227 వ భాగం



కొంతకాలం తరువాత వీరు శంకరులను సమీపించి అయ్యా! మీకు గురుదక్షిణ ఈయాలనుకుంటున్నానంటూ ఒక తాళపత్ర సంపుటిని వీరి ముందుంచారు. అదే నైష్కర్మ సిద్ధియనే గ్రంథం అది నిష్క్రియత్వాన్ని చెప్పే గ్రంథం, అనగా మోక్షాన్ని చెప్పేది. శంకరుల సంకల్పం వీరిలో ప్రవేశించి వ్రాయించి ఉండవచ్చు.


సురేశ్వరులకు ఆ విధంగా ఆటంకం వచ్చి శారీరక సూత్రాల వార్షికం వ్రాసి యుండకపోవచ్చు. కాని శంకరులు రెండు ఉపనిషత్ భాష్యాలకు వార్షికం వ్రాసేరు. తైత్తిరీయము అనేది; కృష్ణ యజుర్వేదానికి చెందింది. బృహదారణ్యకం శుక్ల యజుర్వేదానికి చెందింది. దక్షిణాదిన ఎక్కువగా కృష్ణయజుర్వేదం ఉత్తరాది శుక్ల యజుర్వేదం వాడుకలో ఉన్నాయి. శంకరుల దక్షిణామూర్తి శ్లోకాలపైన మానసోల్లాసం వ్రాసేరు.


కంచి, శృంగేరి, ద్వారక మఠాలవారు సురేశ్వరులను ఆచార్య పరంపరలో చేర్చారు. సురేశ్వరులకు పీఠాధిపత్యానికి అర్హత ఉన్నా, సర్వజ్~ణాత్ముడనే బ్రహ్మచారి, శాస్త్ర సంబంధ విషయాలను చూస్తూ ఉండేవాడు. సురేశ్వరులు సిద్ధి పొందిన తరువాత ఇతడు పీఠాధిపతి అయ్యాడు.


సురేశ్వరులను అన్ని మఠాలకు ప్రధాన వ్యక్తిగా, పర్యవేక్షకునిగా నియమించి ఉంటారు.


ఎందుకిట్లా వీరికి ప్రాధాన్యం ఇచ్చి యుంటారు? పూర్వాశ్రమంలో గొప్ప మీమాంసకులు, వయస్సులో, విద్యలో అందరికంటే పెద్దవారు సంపదనంతటినీ త్యాగం చేసి వచ్చినవారు. కనుక వారికి తగిన స్థానం ఈయాలని పై మూడు మఠాలపై పర్యవేక్షణ చేసే బాధ్యతను వీరికి అప్పగించి యుంటారు. వారి తరపున బ్రహ్మచారిని నియమించి యుండవచ్చు. 


మఠాధిపతికి కొన్ని లౌకిక కార్యకలాపాలు ఉంటాయి. అంటే నిత్య కృత్యంలో కార్యకలాపాలు జరగాలి, వాటిని చూసే సురేశ్వరులకు బాధ్యత అట్లా ఉంచగా, వైదిక కార్యకలాపాలకు బ్రహ్మచారియై వచ్చిన సర్వజ్ఞాత్మునకు పీఠాధితిపత్యాన్ని ఇచ్చి యుంటారు. బ్రహ్మచారియై తరువాత సన్న్యాసించిన వ్యక్తిపై ఎక్కువ పూజ్యభావంతో జనులు చూస్తారు.


కంచిలో ఒక వీధికి మండన మిశ్ర అగ్రహారం అనే నామం ఉంది. వీరికి ఆశ్రమ స్వీకారానికి ముందు జరిగియుంటుంది. మాహిష్మతి నుండి రెండు వందల బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడకు వచ్చాయని యుంటారు.


No comments:

Post a Comment