Sunday 30 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 236 వ భాగం



వంద సంవత్సరాల Aufrecht వెనుక అనే దొర మా మఠ తాళపత్ర పట్టికను తయారు చేసాడు. అట్లాగే జర్మనీలో ఉన్నవాటికీ, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నవాటికీ పట్టికలు తయారయ్యాయి. జర్మనీలో ఉన్న విశ్వవిద్యాలయ గ్రంథాలలో 'గురు పాదాది నమస్కారం' అనే గ్రంథం ఉంది. అందు పృధ్వీధరుని పేరుంది. శంకరుల శిష్యులతో బాటు ఇతని పేరూ ఉంది.


ఇంకా మరేదైనా పుస్తకం వ్రాసాడో లేదో తెలియదు. పై పట్టికనుండి 'ద్వాదశ మహావాక్య వివరణం' అనే తాళపత్ర ప్రతి ఉన్నట్లు తెలిసింది. దానిని వైకుంఠ పురి వ్రాసేడు.


దీనిని బట్టి శంకరులు, దశ నామి సన్న్యాసి పద్ధతిని ప్రవేశ పెట్టారని, సన్యాసి పేరు చివర, దశనామి నామాలలో ఒకటి ఉందని తెలుస్తోంది. తీర్థ - ఆశ్రమ - వన - అరణ్య - గిరి - పర్వత - సాగర - సరస్వతి - భారతి - పురి అనేవి దశనామి సంప్రదాయాలు. వీరందరూ పృథ్వీధరుని శిష్యులే అని యుంది.


"పృధ్వీదరాచార్యః తస్యాపి శిష్యాదశ" 


వీరిని ఒక క్రమపద్ధతిలో పెట్టాడంటే అర్ధమేమిటి? శంకరుల మనోగతానికి అనుగుణంగా వీరిని పరివిధాలుగా విభజించి కొన్ని సంప్రదాయాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సిద్ధాంతం ఒక్కటైనా బాహ్య నియమాలలో కొద్దిగా భేదం ఉంటుంది. ఇందు కొందరు తెల్లని బట్టలు కట్టుకుంటారు. దండానికి వస్త్రానికి ఎట్లా ముడి వేయాలనే నియమాల వంటివి యుంటాయి.


ఈనాటికీ, అట్టి కట్టుబాట్లున్నాయంటే వీరి సంఘటనాశక్తి, కార్య నిర్వహణ సామర్ధ్యం గొప్పదనే కదా.


No comments:

Post a Comment