Thursday 27 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 233 వ భాగం



"అహిమాంశురివ అత్ర విభాసి గురో"


అవి అన్నీ తిరుగుతూ ఉన్నట్లు కన్పిస్తాయి. కాని తిరగకపోయినా నక్షత్ర వీధి సంచారం ఉంటుంది.


మరొక సంగతి గుర్తుకు వస్తోంది. అగస్త్యోదయం కాగా మురికి నీటిలో మురికి అంతా పోతుంది. తేటగా నీళ్ళుంటాయి. అట్లాగే శంకరులనే సూర్యులుదయించగా మురికి బట్టిన బుద్ధులు కలవారికి తేటదనం వస్తుంది. చివరి శ్లోకంలో నేను మూర్ఖుణ్ణి. నాకేమి తెలుసునని మిమ్ము గానం చేస్తున్నా? 64 కళలు తెలిసిన సర్వజ్ఞులు మీరు "విదితా సమయా విశదైకకలా" ఎంత విద్వాంసుడైనా సమగ్రంగా సత్యాన్ని తెలుసుకోలేదని అర్థం.


సర్వజ్ఞులైన ఆచార్యులు సర్వజ్ఞుడైన శంకరునితో "నాకేం తెలుసు? స్మృతులా? శాస్త్రాలా? వైద్యమా? కవిత్వమా? సంగీతమా? పురాణమా? శాస్త్రమా? ఏమీ తెలియకుండా నేను పశువులా ఉన్నానని, నీవు పశుపతివని, అందువల్ల నాపై దయ చూపించుమని అన్నారు. ఇదంతా నిజరూపాన్ని కప్పి పుచ్చి మనలను మోసం చేయడం కాదా!


అందుకే చివరి శ్లోకంలో నా బుద్ధితో మిమ్ము సంతృప్తి పరచలేను.


డబ్బిచ్చి సంతృప్తి పరచలేను. 

"న కించన కాంచన మస్తి గురో" అయినా మీనుండి వచ్చిన అనుగ్రహమే నన్ను రక్షిస్తుంది. అన్ని వేళలా దానిని నాకిత్తురుగాక.


No comments:

Post a Comment