Monday 16 January 2023

శ్రీదత్త పురాణము (21)



మహానుభావా! ఏమిటి మీరు ఇలా నేలపై పడి వున్నారు. శరీరం అంతా దుమ్ముతో కప్పిపోయి వుంది. అంటే మీరు చాలాకాలంగా ఇలా నిశ్చేష్టులై వున్నారన్నమాట ఇది ఏమైనా వ్రతమా, నియమమా? చాలా చిత్రంగా వుంది. లోకంలో ఏ ప్రయత్నము చేయకుండా మనిషికి ధనం లభించదు. ధనం లేకపోతే భోగాలు లేవు. అవి లేకపోతే శరీరం సముజ్వలంగా నిలచియుండదు. ఇవన్నీ వదలి మీరిలా రోజుల తరబడి నేల మీద పడి నిద్రపోతున్నారు. అయినా మీ దేహం సముజ్వలంగా ప్రకాశిస్తుంది. ఇది చాలా ఆశ్చర్యకరం. దయచేసి మీ వింత పద్ధతికి కారణమేమిటో తెలియచెప్పండి. ఎందుకిలా పడి వున్నారో చెప్పండి అన్నాడు.


ప్రహ్లాదా! నిజంగా నీకు తెలియకనే అడుగుతున్నావా? నీవు శ్రీవారిని మెప్పించిన భక్తుడవు, తత్వవేత్తలలో అగ్రగణ్యుడవు. సత్ప్రవర్తనములో నీకు నీవే సాటి. ప్రవృత్తి నివృత్తి ఫలములను ఆధ్యాత్మిక దృష్టితో చూడగలవాడివి. అలాంటి నువ్వు ఈ ప్రశ్న వేయటం నాకు ఆశ్చర్యంగా వుంది. అయినా అడిగావు కాబట్టి చెప్పుతాను దీని వల్ల నీకూ నాకూ ఆత్మశుద్ధి కలుగుతుంది ఆలకించు.


కర్మలు ఆచరిస్తూ వాటి వల్ల కలిగే జన్మల ఫలాలు చూస్తూ ఈ సుడిగుండంలో తిరిగి తిరిగి విసిగిపోయాను. ఇప్పుడు మానవజన్మ ఎత్తాను. ఇది స్వర్గమోక్షాలకు ద్వారసీను. ఇక్కడ పాపకర్మలు ఆచరిస్తే జంతుజన్మ లభిస్తుంది. పాపపుణ్యములు రెండూ చేస్తే మనుష్య జన్మ లభిస్తుంది. దుఃఖాలను తొలగించుకోవటానికి, సుఖాలు పొందటానికి మనుజులు ఏవేవో కర్మలు చేస్తుంటారు. వాటితో లభించే అనుకూల వ్యతిరేక ఫలాలను పొందుతూ వుంటారు. అసలు ఫలానుభవమే వద్దని అనుకున్నవాడు అసలు కర్మలని ఆచరించవలసిన పని ఏముంది. సుఖం ఆత్మస్వరూపం. భోగాలు అనేవి కల్పితములు, ఆశాశ్వతములు. ఈ జ్ఞానం కలిగిన తరువాత నేను ఇంక కర్మలు ఎందుకు ఆచరించాలి. అందువలన నిశ్చేష్టుడనై, నిష్ప్రయత్నుడనై పూర్వజన్మ సంచితాలైన ప్రారబ్ద ఫలములను అనుభవిస్తూ ఇక్కడ పరుండి నిద్రిస్తున్నాను. ఈ రహస్యం తెలుసుకోలేనివాడు తనలోనే నిక్షిప్తమై నాచుతో కప్పబడిన సరోవరంలా ఉన్న సుఖరూప పురుషార్ధాన్ని అందుకోలేక దాహార్తుడై ఎండమావుల వెంట పరుగెత్తుతున్న వానివలె వున్నాడు. కర్మాచరణ వలలో చిక్కి జన్మపరంపరల వలయంలో సుడిగుండంలో తిరుగుతూ వున్నాడు. మోహం యొక్క మహిమ అటువంటిది.


ప్రహ్లాదా! ధనం వల్ల సుఖం కలుగుతుంది అన్నావు గదా అది వట్టి భ్రమ మాత్రమే. దుఃఖమే తప్ప దాని వల్ల సుఖం లేదు. సంపాదనలో దుఃఖం, దాన్ని కాపాడుకోవటంలో దుఃఖం. రాజ, చోర, శత్రు, పుత్ర, మిత్ర, కళత్ర యాచకాదులు అపహరించుకు పోతారేమోనన్న దుఃఖం అనుక్షణమూ భయపడటమే. ధనికులకు నిద్రాహారములు వుండవు. పైగా ఎవరైన ఏ రకంగానైనా ఏ మూల నున్డైనా వచ్చి అపహరిస్తారేమోనని నిరంతరం భయపడుతూ వుంటారు. పైగా దీనికి తోడు వీరికి పక్కనే వుంటుంది అరిషడ్వర్గం సంతానంగా. అంచేత ధనం మీద, దాని మూలమైన భోగముల మీద అనురాగాన్ని వదలివెయ్యటం ఉత్తమం.


1 comment:

  1. అసలు క్రీ.పూ 623వ సంవత్సరం మొదలు బుధ్ధుని మహాపరినిర్వాణం జరిగిన కాలం మధ్యన గౌతమ బుధ్ధుడు తిరిగిన ప్రాంతాలలో పాళీ భాష ఎంతమంది మాట్లాడారు,ఎంతమందికి అది వాడుక భాష అయ్యింది?
    మనం చెప్తే అతి హిందూత్వ వాదుల బనాయింపు పాండిత్యం అంటారు.Kenneth Roy Norman అనే వ్యక్తి సామాన్యుడు కాదు.ప్రపంచ ప్రసిధ్ధి ఉన్న University of Cambridgeకి చెందిన Middle Indo-Aryan languages మీద సాధికారిక పరిజ్ఞానం ఉన్నవాడు.అతనే its emergence was based on a misunderstanding of the compound pāli-bhāsa, with pāli being interpreted as the name of a particular language అనేస్తున్నప్పుడు భారతదేశంలో బుధ్ధుడు తిరిగిన ప్రాంతాల్లో పాళీ భాష కోసం ఇప్పుడు మనం వెతికితే తిరుగులేని ఆధారాలు ఎలా దొరుకుతాయి?
    అత్యంత సుదీర్ఘమైన పరిశోధనల అనంతరం వాళ్ళకి వాళ్ళే చెప్పుకున్న ఆణిముత్యాలు ఇట్లా ఉన్నాయి:Pali was first mentioned in Western literature in Simon de la Loubère's descriptions of his travels in the kingdom of Siam.An early grammar and dictionary was published by Methodist missionary Benjamin Clough in 1824, and an initial study published by Eugène Burnouf and Christian Lassen in 1826 (Essai Sur Le Pali, Ou Langue Sacree de La Presqu'ile Au-Dela Du Gange).The first modern Pali-English dictionary was published by Robert Childers in 1872 and 1875.తెలుగులోకి అనువదిస్తే మార్చి చెప్పానని అంటారు గాబట్టి యధాతధం దించేశాను.చదివారు కదూ!
    అసలు పాళీ భాషయే హుళక్కి బుళక్కి అని తేలిపోయింది గద.ఒక కొత్త మతాన్ని హిందువుల మీద రుద్దడానికి వీళ్ళే ఒక చెత్తభాషని పుట్టించి అందాల రాముడు సినిమాలో ఏయన్నార్ నాగభూషణాన్ని ఏడిపించటానికి వంటపాత్రల్నీ కూరగాయల్నీ చెట్లకింద దాచేసి వచ్చినట్టు కొన్ని రాళ్ళమీద ఈ భాషలో శాసనాల్ని చెక్కించి అక్కడక్కడ పాతిపెట్టి తుఫానొచ్చి లాంచీలు కొట్టుకుపోయాయని అబధ్ధం చెప్పాక మళ్ళీ ఏయన్నారూ రాజబాబూ "ఇదిగో ఇక్కడ బూరెల గంగాళం దొరికింది,ఇదిగో ఇక్కడ పళ్ళాలూ గ్లాసులూ దొరికాయి" అన్న టైపు క్యామిడీ తవ్వకాలు చేసి కట్టుకధల్ని చరిత్ర చొప్పున అల్లేశారనేది యావన్మంది హిందువులకీ అర్ధం అయ్యింది కదూ!
    ఇక,268 BCE మొదలు 232 BCE వరకు ఉత్తర దక్షిణాలలో చూస్తే ఇప్పటి ఆఫ్ఘనిష్తాన్ నుంచి అస్సాము తప్ప ఇప్పటి ఈశాన్య రాష్ట్రాలని కలుపుకుని తూర్పు పదమరలలో చూస్తే హిమాలయాల దిగువ నుంచి కేరళ తప్ప ఇప్పటి భారతదేశపు రాష్ట్రాలను పరిపాలించిన అశోక సామ్రాట్టు "Major rock edicts,Minor rock edicts,Separate rock edicts,Major pillar edicts,Minor pillar edicts" అన్నీ కలిపి 33 శిలా శాసనాలు వేయించితే 20వ శతాబ్దంలో లార్డ్ కన్నింగుహాం గారు వచ్చి తవ్వి తీసేవరకు మనలో ఎవరికీ అశోకుడు అనే గొప్ప చక్రవర్తి మన చరిత్రలో ఉన్నాడని తెలియనే తెలియదంట!
    ఇంతకన్న పోరంబోకు తనం ఎక్కడ ఉంటుంది,చెప్పండి!ఇంకొక దగుల్బాజీ స్టేట్మెంటు ఏంటంటే ఇంగ్లీషోళ్ళు రాకముందర మనవాళ్ళకి చరిత్రని రికార్డు చెయ్యడం తెలియదంట!కల్హణుడు కాశ్మీర దేశపు రాజులను గురించి చెప్పిన "రాజ తరంగిణి" ఎప్పటిది?పాందవాగ్రజుడి మనవడు జనమేజయుడు తన తాతగారిని ప్రస్తావిస్తూ యుధిష్టిర శకంలో కాలాన్ని చెప్తూ వేయించిన శాసనం దొరికింది కదా,కనిపిస్తున్నది కదా!శాతవాహన వంశ స్థాపకుడైన శ్రీ ముఖ శాతకర్ణి గురంచీ శాలివాహన శక స్థాపకుడైన గౌతమి పుత్ర శాతకర్ణి గురించీ వాళ్ళు వేయించిన శాసనాల వల్లనే కదా తెలిసింది!
    మన వాస్తవ చరిత్రలోకి కల్పిత పాత్రల్ని దూర్చిన స్కవుండ్రల్స్ వాళ్ళు చెప్తున్న అబధ్ధాల్ని నిజం అని నమ్మించడానికి మనకి చరిత్రని నమోదు చెయ్యడం తెలియదని వాగితే మనం ఎందుకు నమ్మాలి? నేను మిమ్మల్ని ఇక్కడ అడిగిన అడుగుతున్న ప్రశ్నలని మీరు కూడా హిస్టరీ మ్యాస్టర్లని అడగండి.వాళ్ళకి తెలియకపోతే యూనివర్సిటీ ప్రొఫెసర్లని అడిగి తెలుసుకుని చెప్పమనండి.గోల్మాల్ గుమాయించి సుత్తి వాయించడం కాదు,సాక్ష్యాలు చూపించమని నిలదియ్యండి.జవాబు చెప్పేవరకు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉండండి.అన్ని ప్రశన్లూ గుర్తు లేకపోతే ఒకే ఒక్క ప్రశ్నకి జవాబును రాబట్టండి.
    అది,"క్రీ.శ 18వ శతాబ్దం తర్వాత పుట్టిన పాళీ భాషని క్రీ.పూ 3వ శతాబ్దం నాటి అశోకుడు ఎలా నేర్చుకున్నాడు?" అని.

    జై శ్రీ రాం!

    ReplyDelete