Tuesday 1 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (100)

ఒక్క దేవతను పూజించే వారు అరుదు అని చెప్పాను కదా! ఆలయాలకు వెడితే అనేక దేవతల సన్నిధాలు కన్పిస్తారు. ప్రతి సన్నిధికి వెళ్ళి అందర్నీ పూజిస్తాం. శివాలయంలో విష్ణు విగ్రహం లేకపోయినా, విష్ణ్వాలయాలలో శివమూర్తి లేకపోయినా, శివాలయానికీ, విష్ణ్వాలయానికీ వెడతాం. కాంచీపురంలో భిన్న భిన్న మూర్తులకు భిన్న భిన్న దేవాలయాలు విడిగా ఉన్నాయి. కామాక్షి, ఏకామ్రేశ్వరుడు, వరదరాజు మొదలైనవి అనేకం ఉన్నాయి అన్నిటికీ వెడతాం. విష్ణ్వాలయంలో విఘ్నేశ్వరుడు, విష్వక్సేన నామంతో పిలువబడతాడు. అతనికి నామం ఉంటుంది నుదుటిపై.


ఇక ప్రతి దేవత వినాయకుణ్ణి పూజించాడని లోగడ చెప్పాను కదా. 


కనుక ఆటంకాలను తొలగించే బాధ్యత అతనికి అప్పజెప్పారు కనుక దానిని సమస్త దేవతలూ పాటించారు, పూజించారు. అందువల్ల అన్ని కోరికలను తీర్చే దేవతయని భావించక ఒక్కొక్క ఫలానికి ఒక్కొక్క దేవతను కొలుస్తున్నాం. ఇట్టి సందర్భంలో తతః హేతున్యాయాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి.


సారాంశమేమనగా ఏ దేవతను పూజించినా ముందితణ్ణి పూజించాలని అందరి దేవతలపై ఆధిపత్యం కలవాడని, ఇతర దేవతలను ఫలాలనీయ వలసిందిగా ఆజ్ఞాపించగలడని, అతని ఆజ్ఞను మిగతా దేవతలు శిరసా వహిస్తారని, అట్టి ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఆటంకాలెదురౌతాయని తేలింది.

No comments:

Post a Comment