Wednesday 30 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (129)



విఘ్నేశ్వర గాయత్రి


ప్రతి దేవతకు గాయత్రీ మంత్రం ఉంది. ఉపనయనంలో ఉన్న గాయత్రీ మంత్రానికి సవిత, దేవత. ఆమెయే పరమాత్మ శక్తి. ఇందు 24 అక్షరాలుంటాయి. అందరు దేవతలకూ అట్లా అక్షరాల సంఖ్య ఉంటుంది. వారి గాయత్రీ మంత్రంలో దేవత పేరుంటుంది. మొదటి భాగంలో ఒక పేరు చెప్పి అట్టి దేవతను తెలిసికొందుము గాక అని యుంటుంది. రెండవ భాగంలో ఆ దేవత యొక్క మరొక పేరు చెప్పి అట్టి దేవతను ధ్యానింతుము గాక అని యుంటుంది. మూడవ భాగంలో మరొక పేరు చెప్పి ఆ దేవత మమ్ములను సన్మార్గమున నడిపించును గాక అని ఉంటుంది.


గాయత్రీ మంత్రంలో సవితకు రెండు భాగాలలోను ధ్యానింతుము గాక అని యుండి మూడవ భాగంలో పేరు చెప్పకుండా అట్టి దేవత, బుద్ధులను ప్రేరేపించుగాక అని యుంటుంది.


మహా నారాయణోపనిషత్తులో పెక్కు గాయత్రీ మంత్రాలు చెప్పబడ్డాయి. పరమ శివ, విఘ్నేశ, సుబ్రహ్మణ్య, నందికేశ్వర గాయత్రులున్నాయి. ముందుగా తత్పురుష అని యుంటుంది. కానీ అథర్వవేదంలో విఘ్నేశ్వరునకు ప్రత్యేక గాయత్రి ఉంది. దానిని గణపత్యథర్వశీర్షం అంటారు. అందొక గణపతి గాయత్రి ఉంది. ఇందులో ముందుగా ఏకదంత అనే పదముంది.

No comments:

Post a Comment