Saturday 5 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (104)



అయ్యప్ప విషయంలో వివాదం


ఇక పరమేశ్వరుని మూడవ సంతానమైన అయ్యప్పకు తల్లి ఎవరు? ఇతనికి రాను రాను భక్తులధికమౌతున్నారు. ఇతడీశ్వరునకు, మోహిని అవతారమెత్తిన విష్ణువునకు కలిగిన బిడ్డ.


16 వ శతాబ్దంలో అప్పయ్యదీక్షితులనే మహానుభావులుండేవారు. ఆయన వంశంలో మున్నారు గుడి శాస్త్రిగారు పుట్టారు. దీక్షితుల వారద్వైతియైనా శివభక్తిని ప్రచారం చేసారు. వారి కాలంలో శివ ద్వేషం బాగా ఉండేది. అందువల్ల అట్టి వారిని ఎదుర్కొనడం వీరి లక్ష్యమైంది. తాతాచార్యులనే వైష్ణవుడు ఆకాలంలో వుండేవాడు. విజయనగర రాజులతనిని పోషిస్తూ ఉండేవారు. అతడు వైష్ణవ మతవ్యాప్తిని తీవ్రంగా కొనసాగిస్తూ ఉంటే దాని నెదుర్కొనడం కోసం దీక్షితులు తీవ్ర ప్రయత్నం చేసారు. కాని వీరికి విష్ణు ద్వేషం లేదు. విష్ణువును పరమాత్మ స్వరూపంగానే భావించేవారు. యుక్తులతో, శాస్త్రాధారంతో విష్ణువు, రత్నత్రయంలో ఒకడని నిర్ధారించారు కూడా.


ఒకనాడు రాజు, తాతాచార్యులు, దీక్షితులు ఆలయానికి వెళ్ళారు. ఆ రాజు రామరాయలుగాని, లేక వెల్లోర్ కి చెందిన చిన్న బొమ్మ నాయకుడు గాని కావాలి. లేదా తంజావూరునకు చెందిన వీర నరసింహ భూపాలుడైనా కావాలి. ఆలయంలో అయ్యప్ప విగ్రహముంది. అతణ్ణి శాస్త అని కూడా అంటారు. అది చిత్రమైన విగ్రహం. ముక్కుమీద వేలు వేసుకొన్నట్లుగా ఆ విగ్రహముంటుంది, ఏదో ఆలోచిస్తున్నట్లుగానూ ఉంటుంది.


No comments:

Post a Comment