Wednesday 16 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (115)

మొదటి శ్లోకం ఏమని చెప్పింది? మనమే దేవతను భజించాలన్నా, ఆ దేవత ముందుగా వినాయకుణ్ణి భజించాలని, అందువల్ల వినాయకుడే భజిస్తే సరిపోతుంది కదాయని చెప్పింది.


ఇక రెండవ శ్లోకం అట్లా చెప్పలేదు. శంకరుడు, పార్వతి కాళ్ళపై బడినా పార్వతి కోపాన్ని అభినయిస్తూనే ఉంది. లోపల కలవాలని ఆమెకూ ఉన్నా చివరకు వినాయకుని లీలావినోదం వల్ల హాయిగా వారు నవ్వుకొని హృదయ పూర్వకంగా కలిసారని ఉంది. అంటే ఇందు శంకరుడు ముందుగా వినాయకుణ్ణి అర్చించలేదు. పార్వతిని అర్చించినట్లైంది. కనుక అతని ప్రార్థన నెరవేరలేదు. ఎప్పుడు నెరవేరింది? వినాయకుడు వినోదాన్ని కల్గించినపుడే. అంటే వినాయకుడు ఫలాన్ని అందించాడు. అట్లాగే శంకరుని కలవాలని పార్వతి భావించినా ఆమె కోపం అడ్డు తగిలంది. వినాయకుని వల్లే ఆమె కోపం చల్లారింది. కనుక ఇద్దరి ప్రార్ధనలూ ఇతనివల్ల నెరవేరాయి. ఇందువల్ల, ఇతడేదైనా ఎవరికైనా ఈయగలడని తేలలేదా? ఇతడు ఒక్కణ్ణి అర్చించినా చాలని తేలడం లేదా?


ఇలా వీరిద్దర్నీ కలపాలని అనుకొన్నట్లుగా ముందితనిలో లేదు. వారిద్దరు కలుసుకునేటట్లు ఒక ఆట ఆడాడు. రెండు శ్లోకాలలోనూ ఇతడు స్వార్థ ఫల ప్రదాతయే.

No comments:

Post a Comment