Sunday 6 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (105)



చిత్రంగా ఉన్నాడేమిటని రాజు ప్రశ్నించాడు. అక్కడున్న భక్తులు, ఇది పురాతన విగ్రహమని; శిల్పికి ఇట్లా మూర్తి సాక్షాత్కరించడం వల్ల మలిచాడని అన్నారు. రాబోయే కాలంలో అన్నీ తెలిసిన విద్వాంసుడు వచ్చి శాస్త యొక్క బాధను వెల్లడి చేస్తాడని అప్పుడు మిగతా విగ్రహాల మాదిరిగా ముక్కు మీద వేలు ఉండకుండా ఉంటుందని అన్నాడట. అప్పటికే ఎందరో విద్వాంసులు వచ్చారు. రకరకాల కారణాలను చెప్పినా మునుపటి మాదిరిగానే విగ్రహం ఉందన్నారు. ఎవ్వరూ ఇంతవరకూ ఆ వ్రేలును క్రిందకు దింపలేక పోయారని అన్నారు. రాజు తాతాచారి పంక చూసాడు. దానికి కారణాన్ని ఇట్లా శ్లోకరూపంలో ఆయన అందించాడు:


విష్ణో: సుతోహం విధినా సమోహం ధన్యస్తతోహం సుర సేవితోహం 

తథాపి భూతేశ సుతోహమేతై: భూతైః వృతైః చింతయతీహ శాస్తా 


శ్లోకంలో శాస్త ఇట్లా అన్నాడని ఉంది: "నేను విష్ణువు యొక్క తనయుణ్ణి. కనుక బ్రహ్మతో సమానం. అందువల్ల దేవతలచే పూజలందుకొంటున్నాను” కాని...?


శ్లోకంలో తథాపి, అనగా అయినా అని అర్థం. ఇందువల్ల శివునకు సంబంధించిన విషయాలలో తల దూర్చనని తాతాచార్యులగారి అభిప్రాయం.


శాస్త ఏమి చెప్పి యుంటాడు? నేను శివుని కుమారుణ్ణి కూడా అనాలి కదా. తథాపి భూతేశ సుతోహం అని అనాలి. శివునకు చాలా పేర్లున్నాయి. శివ, ఈశ్వర, శంభు, పశుపతి మొదలైనవి. ఇన్ని పేర్లున్నా భూతేశ పదం వాడబడింది. అనగా భూతాలకు నాయకుడని; అట్టి వాని కొడుకునయ్యానని బాధపడినట్లు తాతాచార్యులూహించారు.


భూతాల ఆధిపత్యం అంటే అది అతని శక్తిని, అధికారాన్ని సూచించడం లేదా? పరమేశ్వరుడు భూతాలను నియమిస్తాడు, మంచివారిని బాధించకుండా చేస్తాడు. అట్లా వారిని రక్షిస్తున్నాడు కదా! భూతాలను ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా చేస్తున్నాడు కదా.

No comments:

Post a Comment