Sunday 20 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (119)



మనం గమనిస్తే ఈ కదలికకు, ఈ సంఘర్షణలకు దగ్గర సంబంధం ఉంది. ఒక కదలిక, ఒకనికే ఉండి, మిగిలినవన్నీ కదలకుండా ఉంటే అతడు హాయిగా తన కిష్టం వచ్చినచోటుకు వెళ్ళగలడు. (అన్ని కదలికల గురించి చెబుతున్నా, ఇది అభ్యాసంలో ఉందా? అందరికీ విశ్రాంతి లేని కదలికలే ఉన్నాయి. అచేతనాలలోనూ కదలిక ఉంది. అణువులోనూ నిరంతరం కదలిక యుంది. ఇట్లా చేతన అచేతన వర్గాలన్నీ కదిలేటప్పుడు పరస్పరం సంఘర్షణ ఉండదా? ఇట్టి సంఘర్షణ ఒకదానికొకటి పొసగక పోవడమే కదా.


అసలు మూలాన్ని అన్వేషిస్తే చేతనంగాని, అచేతనం గాని కదలికలో నుండుటయే సంఘర్షణ. శాంతి కలిగినపుడు ఎట్టి కదలిక లేకపోవడాన్ని గమనిస్తున్నాం. శాంతి లేనపుడు సంఘర్షణయే. యుద్ధం, శాంతి పరస్పర విరుద్దాలని మనం అనడం లేదా?

అసలు జీవితమే ఒక సంఘర్షణ కాగా ఇది ఇద్దరు యుద్ధం చేసినపుడు స్పష్టంగా గోచరిస్తోంది. అందువల్ల 'సంగ్రామే' అని శ్లోకం. అంటే యుద్ధం అట్టి సంగ్రామంలో కూడా విఘ్నాలుండవని, విజయం వరిస్తుందని శ్లోకార్థం.


దీనినింకా పొడిగిస్తే అన్ని రంగాలలోనూ విజయమే. ఇంకా ఈ అర్థాన్ని పొడిగిస్తే సంపూర్ణత్వం వస్తుందని అనగా సమాధి స్థితి కల్గుతుందని, అది కదలిక, సంఘర్షణ లేని స్థితియని తెలుస్తుంది. విద్యారంభమనగా బ్రహ్మచర్యాశ్రమమని, వివాహే అనగా గృహస్థాత్రమమని; అన్నాం. ఆత్మ సమాధి యనినపుడు సన్యాసాశ్రమమని అర్థం. 


No comments:

Post a Comment