Friday 11 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (110)



చంద్రకళతో స్వామి ఆడుకున్న రోజు


మైసూర్ రాష్ట్రంలో, చామరాజనగర్ లో రామశాస్త్రి అనే కవి యుండేవాడు. రావణ సీతా సంభాషణాన్ని సీతారావణ సంవాదంగా వ్రాసేడు. ఆమె తక్కువగానే మాట్లాడుతుంది. ఇందు రావణ సుదీర్ఘ సంభాషణయే యుంటుంది. ఆవిడ విని చాలా తక్కువగా మాట్లాడి తిరస్కరిస్తుంది. ప్రతి శ్లోకంలోనూ మూడు పంక్తుల సంభాషణ, రావణునిది. మిగిలిన పాదం, సంభాషణ సీతది. దీనిని సీతారావణ సంవాద ఝరి అని కూడా అంటారు. ఒక శ్లోకం వెంబడి మరొక శ్లోకం ఉండడం వల్ల దీనిని ఝరియని అన్నారు. ఇందు ముందుగా గణేశస్తుతి యుంది. ఈ శ్లోకంలో చంద్రమౌళియైన గణేశుని లీల ఉంది. కోపాన్ని నటించే పార్వతీ పరమేశ్వరులు ఈ లీలవల్ల ఒకటౌతారు. ఇది మంగల శ్లోకం:


క్రీడారుష్టాద్రి జాంఘ్రి ప్రణత శివశిరశృచంద్రఖండే కరాగ్రం 

లీలాలోలం ప్రసార్య స్ఫురతరామలబినసంఖ్యాక్రఘ్టకామః 

విద్యాత్ హృద్యస్మితాఖ్యాం అహమహమిక యాభిగమ్యమానః శివాఖ్యాం 

కశ్చిత్ సః చింతితార్థం కలయతు కలభోబాల లీలాభిరామః


తా: గణపతి అనే పిల్ల ఏనుగు క్రీడిస్తోంది. కలభో బాలలీలాభిరామ; అట్టి పిల్లవాడు మనం కోరేది ఇచ్చుగాక నః చింతిత అర్ధం కలయతు అనేది చివరిపాదం, ముందున్న మూడు పాదాలు గణపతి యొక్క క్రీడను వర్ధిస్తాయి. అది అమాయకమైన క్రీడయని గాని; తుంటరిపని యనిగాని అనలేం. ఏదైనా వినడానికి బాగుంటుంది. ప్రణయ కలహం ఇందలి తత్త్వం.


కవి, పార్వతిని అద్రిజయని చెప్పి ఆమె భర్తపై లేనిపోని కోపాన్ని ప్రదర్శిస్తోంది అని చెప్పడానికి క్రీడారుష్టా అన్నాడు. అంటే సరదాగా కోపమని. అట్టి సందర్భాలలో నాయకుడు, నాయిక యొక్క కాళ్ళపైబడి వేడుకుంటాడు. గీత గోవిందంలో రాధ పాదాలపై కృష్ణుడు పడినట్లుంది. తమిళంలోని తిరుప్పగళ్ లో సుబ్రహ్మణ్యస్వామి, ఆటవిక కన్యయైన వల్లి పాదాలపై పడినట్లుంది. 


No comments:

Post a Comment