Wednesday 9 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (108)


కథంను' లో 'ను' సందేహాన్ని తెలివిడి చేస్తోంది. 'ఇతి చిం' తయంతం శాస్తారం = ఇట్లా అయ్యప్ప బాధపడుతున్నాడు. ఈడే = స్తుతిస్తున్నాను. 


సకలార్థ సిద్ధైయ శాస్తారామీడే = సకల పురుషార్థాలను ప్రసాదించే శాస్త్రను నుతిస్తున్నానని దీక్షితులు శ్లోకాన్ని ముగించారు.


లోగడ విఘ్నేశ్వర స్తుతిలో 'సర్వార్ధ ప్రతి పాదన చతుర' అని విన్నాం . శాస్తకు సంబంధించిన శ్లోకంలో సకలార్థ సిద్ధియని అంటున్నాం. ఇట్లా ఇద్దరికీ సంబంధం ఉంది. వినాయకుని స్తోత్రం వ్రాసినవాడు దీక్షితుల వంశంలో జన్మించిన మన్నారు గుడి శాస్త్రిగారే. శాస్త శ్లోకాన్ని దీక్షితులు వ్రాసేరు.


దీక్షితుల శ్లోకంలో ఒక దేవత పెద్దయని, ఒకడు తక్కువ వాడని లేదు. అమ్మవారిని, లక్ష్మిని కలిపి వాడాడు. తన బుద్ధివైభవాన్ని చూపించడమే కాకుండా అన్ని పురుషార్ధాలు పొందాలంటే శాస్తను భజించాలని భక్తితో అన్నాడు.


మరో మాట ఏమిటంటే ఇది తెలియని ప్రశ్నల ద్వారా ఆడే ఆటలా ఉంది. ఈ చిక్కు సమస్యను ఎవరూ విప్పలేరు కూడా.


ఇక ఆ వ్రేలు క్రిందకు వచ్చింది. ఇట్లా విగ్రహం, మామూలుగా మారడాన్ని చూసినవారూ ముక్కుమీద వ్రేలు వేసుకొని ఆశ్చర్యపోతారు కదా! 


పరమేశ్వరుని పెద్ద కొడుకును చెప్పబోయి మిగిలిన పిల్లలను తడిమాం. ఇది బాగుంది.

No comments:

Post a Comment