Thursday 10 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (109)



విఘ్నేశ్వరుడు రక్షించుగాక


ఇట్లా 'సర్వార్త ప్రతిపాదనైక చతురో...' తో న్యాయేందు శేఖర గ్రంథంలోని శ్లోకం పూర్తి అవుతుంది. తతః హేతున్యాయం ఉగ్గడింపబడింది కదా.


ఒకడు నవాబు గారిని యాచించడానికి అతడున్న భవనానికి వెళ్ళాడట, కాసేపు ఆగు; నవాబుగారు నమాజ్ కి వెళ్ళారని జవాబు వచ్చింది. నాకు కావలసింది అడగడానికి నవాబు దగ్గరకు వచ్చాను. అతనికేదో కావాలని అల్లాను ప్రార్థిస్తున్నాడు. అటువంటప్పుడు ఒక యాచకుడు, మరొక యాచకుణ్ణి అడగడానికి బదులు తిన్నగా అల్లానే అడుగవచ్చు కదా అని తిరిగి వెళ్ళిపోయాడట.


అట్లా అందరు దేవతలూ వినాయకుణ్ణి విఘ్నాలు లేకుండా ఉండాలని వేడుకొంటున్నారు కదా. ఏవో చిన్న కోరికలను వేడుకోవడానికి బదులు తిన్నగా విఘ్నేశ్వరుణ్ణి వేడుకోవచ్చు కదా అని పై శ్లోకం వల్ల తెలియవస్తోంది.


No comments:

Post a Comment