Tuesday 15 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (114)

మనమందరమూ వారి సంతానమైనా గణపతివారికి మొదటి సంతానం, గణపతి వారిలో వారికి రాజీ కుదర్చగలడు. అందువల్ల ప్రపంచానికి క్షోభ ఉండదు. ఇట్లా తండ్రి శిరస్సు పైనున్న చంద్రలేఖను ఊడబెరికి వారినిద్దరినీ కలిపాడు.

పిల్లవాణ్ణి ముద్దు పెట్టుకునేటపుడు వారు ప్రత్యక్షంగా పరస్పరం తాకినట్లు కవి చెప్పలేదు. హృదయపూర్వకంగా నవ్వుకున్నారని అన్నాడు. కృత్రిమంగా కోపాన్ని అభినయించినవారు పరస్పరం కలుసుకున్నారని అన్నాడు.

అట్టి వినాయకుడు మన పురుషార్థాలను నెరవేర్చుగాక. నః చింతితార్థం కలయతు.

ఇందలి శ్లోకం, న్యాయేందుశేఖరంలోని శ్లోకానికి ప్రమాణంగా ఉంది.

పార్వతి, తనతో కూడాలని పరమేశ్వరుడు భావించాడు. కాళ్ళ మీద పడ్డాడు. కాని వినాయకుడే అతని కోర్కెను తీర్చాడు. పై తర్క గ్రంథంలో ఈ సంపాదంలోనూ ఇందు శేఖర పదం ఉంది. చూసారా ఈ తర్కశాస్త్ర శ్లోకానికి ప్రామాణ్యాన్ని? ఇట్లా ప్రాచీన వాఙ్మయాన్ని పరిశీలిస్తే అది ఒక బంగారు గనిగా కన్పిస్తుంది.

No comments:

Post a Comment