Monday 21 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (120)



ఫలానా ఆశ్రమమని చెప్పకుండా అన్ని కార్యాలలోనూ "సర్వ కార్యేషు" అని విఘ్నం లేకుండా అని చెప్పింది.


సర్వ కార్యేషు విఘ్న: తస్య నజాయతే


ఒక విషయాన్ని రకరకాలుగా చెప్పినపుడు మన మనస్సులో బాగా నాటుకుంటుంది. దేంట్లోనూ విఘ్నం ఉండదని అంటే నాటుకోదు. ఇక అన్నిటిలో విఘ్నం ఉండదని చెప్పినప్పుడు బాగా నాటుకుంటుంది.


విఘ్నాలు లేకుండా చేసే ఆ వ్యక్తి ఎవరు? అతనికున్న నామాలెన్ని? షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి


అనగా వినాయకుని 16 నామాలను ఎవరు పఠిస్తారో లేదా వింటారో వారికి వారి పనులలో ఆటంకాలుండవని. ఈ పదహారింటిని కంఠస్థం చేయాలి. చేయలేనివారు చదవడం వల్లగాని, వినడం వల్ల గాని లాభం పొందవచ్చు. అంతేకాదు, అనేక నామాలున్నాయి స్వామికి. 21 దళాలతో అర్చిస్తాం. 21 నామాలను పల్కుతాం. 21 దూర్వలతో అర్పిస్తాం. కాని శ్లోకంలో 16 నామాలే చెప్పబడ్డాయి.

No comments:

Post a Comment