Thursday 3 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (102)



ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడు (ద్వైమాతురుడు)


పై శ్లోకంలో మన స్వామి, ద్వైమాతురుడని పేర్కొనబడ్డాడు. అనగా ఇద్దరు తల్లులు కలవాడు. ఎప్పుడైనా ఒకనికి ఇద్దరి భార్యలున్నట్లు వింటాం. కాని ఒకనికి ఇద్దరు తల్లులుండడమేమిటి? అమ్మవారు తల్లియని తెలుసు.


ఈశ్వరుని నెత్తి పైనున్న గంగను అతనికి రెండవ భార్యగా తలుస్తాం. సౌందర్య లహరిలో శంకరులు, అమ్మవారి నేత్రాలు క్రోధాన్ని, ఆశ్చర్యాన్ని భయాన్ని, అసూయను ప్రదర్శిస్తున్నాయని, ఈశ్వరుని నెత్తిపై నున్న గంగను చూచినప్పుడు కోపమని సరోషా గంగాయం అని చెప్పారు (51 శ్లో). ఎవరీ గంగ? ఆమె నా తండ్రి భార్య, కాబట్టి ఆమెను కూడా తల్లిగా భావిస్తానని ప్రేమతో అంటాడట వినాయకుడు. అందువల్ల ద్వైమాతురుడు.


అంతకంటే సుబ్రహ్మణ్యుని గంగాతనయుడని అనడం మేలు, గంగనుండి పుట్టాడు కనుక. శివుని నేత్రం నుండి నిప్పురవ్వలు వచ్చాయని వాటిని గంగ భరించిందని, అపుడు సుబ్రహ్మణ్యుడవతరించాడని అందరికీ తెలుసు. కనుక అతడు గాంగేయుడు.

No comments:

Post a Comment