Monday 14 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (113)



ఇట్లా లీలావినోదం కలిగించే పిల్లవానిని చూసి వారిద్దరి కోపం పోయి హాయిగా నవ్వు కొన్నారట. శ్లోకంలో 'హృద్య స్మితాభ్యాం' అని ఉంది. అంటే కేవలం నోటితో నవ్వడం కాదు. అతడామె సేవకుడని నటించడం కాదు వారి హృదయలూ విచ్చుకొన్నాయి. విచ్చుకొని నోటితో నవ్వారన్నమాట. హృద్యా ఇద్దరు పిల్లవాణ్ణి ఒక్కమాటే ముద్దాడదామని అనుకున్నారు. హృద్యా స్మితాఖ్యాం అహమహమికయా ఆలింగ్యమానః శివాభ్యాం. హాయిగా నవ్వుతూ నేనంటే నేనని ముద్దాడాలని ముందుకు వచ్చారు.


ఒక్కమారే ముద్దు పెట్టుకున్నారు. పిల్లవాణ్ణి ముద్దు పెట్టుకోవడంలో తల్లిదండ్రులు పొందే ఆలింగన భాగ్యాన్ని తిరుక్కురల్ కూడా ప్రశంసించిది. శకుంతలను విడిచి పెట్టిన దుష్యంతుడు, కణ్వాశ్రమంలోని తన కొడుకైన భరతుణ్ణి చూసీ చూడడంతోనే కౌగలించుకొనాలని బుద్ధి పుట్టిందని, తొడపై కూర్చుండబెట్టుకొన్నపుడు అతనికి కలిగిన ఆనందాన్ని వర్ణించాడు కాళిదాసు. అట్లాగే లవకుశులను రాముడు కౌగలించుకున్నట్లు భవభూతి ఉత్తర రామచరితంలో వర్ణించాడు.


పార్వతీ పరమేశ్వరులు గణపతిని నిజంగా కౌగలించుకున్నారా? నిజంగా వీరిద్దరే కౌగలించుకున్నారు. కౌగలించుకొనేటపుడు చేతులు చాస్తారు కదా!


వారు అభినయించే కోపం కలకాలం ఉంటుందా? వారు జగత్తునకు తల్లిదండ్రులు కదా!


No comments:

Post a Comment