Tuesday 8 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (107)



ఇక దీక్షితులవైపు చూసాడు రాజు. ఈయనా శ్లోక రూపంలో సమాధానమిచ్చాడు.


అంబేతి గౌరీం అహమాహ్వయామి పత్న్యః పితుః మాతర ఏవ సర్వాః 

కథంను లక్ష్మీం ఇతి చింతయంతం శాస్త్రారమీడే సకలార్థ సిద్యై 


తా: శివుని భార్యయైన గౌరిని తల్లియని పిలుస్తున్నాను. "అంబ ఇతి ఆహ్వాయామి" కాని మోహిని రూపంలో విష్ణువుండడం వల్ల మోహినియే నా తల్లి. తండ్రి యొక్క భార్యలందరూ నాకు తల్లులే కదా! గణపతి, గంగను తల్లియని అనలేదా?


పరాశక్తితో నాకున్న సంబంధాన్ని నేను సందేహించడం లేదు. కారణమేమంటే ఈశ్వరుడు నా తండ్రి, విష్ణువు నా తల్లి. పత్య్నః పితుః మాతర ఏవ సర్వాః = తండ్రి భార్యలందరూ నా తల్లులే.


కాని ఒక విషయంలో సందేహం ఉండిపోయింది. ఈ బాంధవ్య విషయంలోనే. ఏమది? ఎవరితో నా బాంధవ్యాన్ని బాహాటంగా చెప్పలేకపోతున్నాను? లక్ష్మితోనున్న సంబంధాన్ని, లక్ష్మిని ఎట్లా సంబోధించను? = కథంను లక్ష్మీం? ఇది శాస్త యొక్క సందేహం. అందువల్ల ముక్కుపై వ్రేలు వేసుకున్నాడు. దీనికి సమాధానం మనకు తెలియదు ఎట్లా?


ఎవరు లక్ష్మి? విష్ణుని భార్య. విష్ణువెవరు? శాస్తతో అతనికున్న సంబంధమేమిటి? మహావిష్ణువు మోహినీ అవతార మెత్తాడు. పరమేశ్వరునితో కూడడం వల్ల శాస్త్ర పుట్టాడు. అందువల్ల శాస్త్ర, హరిహరపుత్రుడయ్యాడు. అయితే ఈ శాస్తకు లక్ష్మికి ఉన్న సంబంధమేమిటి? అంటే తల్లి యొక్క భార్యయని అనాలి కదా?


తండ్రి యొక్క భార్యయని, మేనమామ యొక్క భార్యయని విన్నాం. తల్లి యొక్క భార్యయనే మాటను విన్నామా? ఇప్పుడు శాస్త లక్ష్మిని ఎట్లా సంబోధించాలి?

No comments:

Post a Comment