Wednesday 23 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (122)



షోడశనామ శ్లోకాలు


స్వామికి ప్రధానంగా 16 నామాలు, సుముఖ, ఏకదంత, కపిల, గజకర్షక లంబోదర, వికట, విఘ్నరాజ, వినాయక, ధూమ్రకేతు, గణాధ్యక్ష, భాలచంద్ర, గజానన, వక్రతుండ, సూర్పకర్ణ, హేరంబ, స్కంద పూర్వజ - అనేవి. 


సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః


లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః


ధూమ్రకేతుః గణాధ్యక్షః భాలచంద్రో గజాననః


వక్రతుండః పూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః


ఈ శ్లోకం తరువాత షోడశైతాని నామాని అనే శ్లోకం వస్తుంది.


విఘ్నేశ్వరుడు అనేక రూపాలనెత్తాడు. దానికి తగ్గట్లు షోదశగణపతులూ ఉన్నారు


ఈ 16 నామాలూ, 16 గణపతులను సూచిస్తాయని పరిశోధన చేయగా కాదనిపిస్తోంది. షోదశనామాలలో మూడవది కపిలుడు. అనగా ఎరుపున్న రూపం (నీల పీతమిశ్రిత వర్ణమని కొందరు, గోరోచన వర్ణమని కొందరంటారు). కాని ధ్యాన శ్లోకంలో ఇతనికి శరత్కాలపు కాంతి యున్నట్లు వర్ణింపబడింది. ఇక పదహారవ నామం హేరంబుడు. ఇందులోనూ అభిప్రాయ భేదాలున్నాయి. కనుక ఈ రెండూ భిన్న వర్గానికి చెందుతాయి. సరేసరి.


No comments:

Post a Comment