Friday 4 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (103)



ఇట్లా గంగతో వినాయకునకు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా ఆమెను తల్లిగా భావించాడు. ఇది అతని ప్రేమతత్త్వాన్ని, స్నేహ తత్త్వాన్ని ప్రకటిస్తోంది. స్త్రీలనందరినీ తల్లులుగా భావించిన స్వచ్ఛమైన బ్రహ్మచారి.


ఏనుగుకి నీళ్ళంటే చాలా ఇష్టం. ఇట్లా గుఱ్ఱం, పెద్ద పులి, సింహం ఉండవు. బురదలో పొర్లాడడానికి ఇష్టపడతాయి గేదెలు. పెద్ద శరీరంతో నీళ్ళలో ఈత కొట్టడానికి ఇష్టపడుతుంది ఏనుగు. అవి గుంపులుగా నదులు వద్దకు వెళ్ళడం, అందులో జలకాలాడటం మనకు తెలిసిందే. అట్టి దృశ్యాన్ని మనం గజేంద్ర మోక్ష ఘట్టంలో చూడవచ్చు.


ఒకనికి ఆర్గురు తల్లులు


వినాయకునకు ఇద్దరు తల్లులైతే అతని తమ్ముడైన సుబ్రహ్మణ్యునకు ఆర్గురు తల్లులు. అతడు షాణ్మాతురుడు. అందు అమ్మవారు, గంగ లేరు. వీరు కృత్తికానక్షత్రానికి అధి దేవతలైన ఆర్గురు తల్లులు. వీరే ఇతనికి పాలనిచ్చారు. వీరిని తల్లిగా భావించాడు కనుక అతడు కార్తికేయుడయ్యాడు. 


No comments:

Post a Comment