Saturday 12 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (111)



అసలర్థమేమిటి? జీవాత్యయే ఇక్కడి నాయిక. పరమాత్మయే నాయకుడు. పరమాత్మ నుండి బైటకు జీవుడు పోవాలనుకున్నా, పరమాత్మ తనలో కలుపు కొనేటట్లు చేస్తాడు. కనుక జీవాత్మను వేడుకొంటాడని అతని కాళ్ళపై పడతాడు. వీరిద్దరి మధ్య సఖి యుంటుంది. వీరిద్దర్నీ కలపాలని ప్రయత్నిస్తుంది. ఇద్దర్ని కలుపువాడే ఆచార్యుడు లేదా గురువు. ఆ గురువే సఖి. పైపైన ఇది ప్రేమగా కనబడినా లోతుగా ఆలోచిస్తే జీవాత్మ పరమాత్మల కలయికయే పార్వతీ పరమేశ్వరుల బిడ్డయైన వినాయకుడు చేసాడు.


పార్వతి ఏదో ముభావంగా కూర్చొని యుంటుంది. పరమేశ్వరుడు కాళ్ళపై బడ్దాడు. ప్రణతశివ యనగా శివుడు నమస్కరిస్తున్నట్లుగా పడ్డాడని. జటతో కూడిన శిరస్సుతో పార్వతి పాదాలపై శివుడు పడగా ముందుగా చంద్రకళ యొక్క ప్రకాశం బాగానే పడింది.


పిల్ల యేనుగు సరస్సులో ప్రవేశించినపుడు తామరతూండ్లను పెకలించి అందలి నారను ఇష్టంతో తింటుంది. తామర తూడుతో బైటకు వస్తుంది. ఆ చంద్రలేఖ తామర తూడునుండి వచ్చే తెల్లని పీచులా కనబడింది గణపతికి. వెంటనే దాని నూడ బెరికి తిందామనుకున్నాడు.


అతనికి నిజంగా సందేహం కలుగుతుందంటారా? తల్లిదండ్రులను కలవడం కోసం నాటకం ఆడుతున్నాడా? శ్లోకాన్ని 'బాల లీలాభిరామతో ముగించాడు. లీలాలోలం' అనే మాట శ్లోకంలో వ్రాసాడు.


No comments:

Post a Comment