Sunday 3 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 120 వ భాగం



శంకరులు స్థాపించిన మఠాలలోని ఆచార్యులు మఠ కార్యక్రమాలను నిర్వహించాలి కనుక, పరమహంస పరివ్రాజకుల విషయంలో కొంత సడలించారు. ఇది కేవల ధర్మ సంస్థాపన కోసమే.


శాస్త్రాలలో అత్యాశ్రమి, సన్న్యాసస్థితి కంటె అతీతుడైనవాడైన పరమహంసగానే పరిగణింపబడ్డారు. అందు పరమహంస సన్న్యాసులే బట్టలను, దండాన్ని, కమండలువులను విడిచి పెట్టినట్లు ఉంది. శుక, దత్తులట్టివారు. శంకరులు ఛాందోగ్యోపనిషత్తు భాష్యంలో అత్యాశ్రమియనగా పరమహంస పరివ్రాజకులనే వ్రాసేరు. ఇద్దర్నీ కలిపి వాడడం చాలాకాలం సాగింది.


శాస్త్రాలు రెండు రకాలైన సన్న్యాసాన్ని పేర్కొన్నాయి. వివిదిషా సన్న్యాసమని, విద్వత్ సన్న్యాసమని. తురీయాశ్రమాన్ని యతి ధర్మ నియమాలను పాటిస్తూ ఉన్నవాడు అన్నిటినీ విడిచి అత్యాశ్రమి అవుతాడు. వివిదిషయనగా తెలిసికొనుట. సమాధి, ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మానందం ఏమిటో తెలుసుకొనేవాడు. అతడు గృహస్థ జీవితాన్ని గడుపుతూ వాటిని తెలుసుకోవడం కుదరదు. కనుక శాస్త్ర నియామాలను పాటిస్తూ దండ, కమండులువులను ధరించి సన్న్యాసం పుచ్చుకొన్నవాడు వివిదిషా సన్న్యాసి.


ఆశ్రమం పుచ్చుకొని, ఆత్మశాస్త్రాన్ని అభ్యసిస్తూ అప్పుడప్పుడు ఆత్మానుభూతి కల్గుతుంది. తరువాత విద్వత్ స్థితి వస్తుంది. తరువాత దండాదులను విడిచి పెడతాడు. అపుడు విద్వత్ సన్న్యాసి.


సన్న్యాసం నుండి సన్న్యాసం పుచ్చుకోవడమంటే విరక్తి పుట్టకుండా సన్న్యాసం ఎందుకులే అనే ఇంటికి తిరిగి రావడం.


అత్యాశ్రమి ఇట్లా తిరిగి రాడు. యతి ధర్మాలనే విడిచిపెడతాడు. సన్న్యాసాన్ని దాటి యుంటాడు. నిరంతరం సమాధి స్థితియే అతని లక్ష్యం. అంటే అందరూ అట్లా కావాలని లేదు. జనకుడు గృహస్థాశ్రమంలో ఉండే జీవన్ముక్తుడు కాలేదా? బ్రహ్మచర్యాశ్రమంలోనే ఉండి సమర్థ రామదాసు జీవన్ముక్తుడు కాలేదా? ఇక సన్న్యాసంలోనే ఉండి అట్టి స్థితిని పొందిన వారున్నారు.


No comments:

Post a Comment