Monday 4 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 121 వ భాగం



సాక్షాత్కారం పొందిన తరువాత సన్న్యాసాశ్రమ నియమాలను పాటించినా అతనికేమీ చిత్తక్షోభ ఉండదు. వీరెట్లా ఉండాలో అంతా ఈశ్వర సంకల్పాన్ని బట్టి యుంటుంది. నియామతీతులుగా కొందర్ని తీర్చిదిద్దుతాడు.


గౌడపాదులనుండి, అద్వైత సంప్రదాయంలో నియమాలతో కూడిన ఆశ్రమమే ఉంది. కనుక శంకరులు, సన్న్యాసి నుండే దీక్షను స్వీకరించారు. గాని, అత్యాశ్రమి నుండి కాదని సారాంశం. పైవారిద్దరూ ఒక్కటే అని ఏ సందర్భంలో శంకరులన్నారు?


ఛాందోగ్యపనిషత్తులో ఇంద్రుణ్ణి ప్రజాపతి పరీక్ష చేసి ఆత్మ తత్త్వాన్ని అందించాడు. అన్ని కోరికలనూ విదిలి ఆత్మజ్ఞానానికే అంకితమైనవారు, అత్యాశ్రములని వారే పరమహంస పరివ్రాజకులని అన్నారు. ఇట్టివారే ఉపదేశించుటకు అర్హులని అన్నారు. శంకరుల కాలంలో అట్టి ఉపదేశం ఇచ్చే వారున్నారు. ధర్మం పూర్తిగా కనుమరుగు కాలేదు. బౌద్ధులకు భిన్నంగా సంప్రదాయానికి బద్ధులై ఆత్మవిచారణ చేసేవారుండేవారు.


అందు అత్యాశ్రములు, తురీయాశ్రములూ ఉండేవారు. శంకరులు తురీయాశ్రమం గురువు ద్వారా తీసుకోవాలనుకున్నప్పుడు అత్యాశ్రమి దగ్గరకు వెళ్ళకుండా శాస్త్ర నియమాలను పాటిస్తూ ఆత్మజ్ఞానులైన వారినే గురువులుగా ఎన్నుకొన్నారని సారాంశం. ఉపనయనానికి ముందే అత్యాశ్రమియైన శుకుని వంటివారి నుండి కాకుండా తురీయాశ్రమంలో ఉంటూ శాస్త్ర నియమాలు పాటిస్తున్న గోవింద భగవత్పాదుల దగ్గరకు వెళ్ళారు. గౌడపాదులకు ప్రత్యేకంగా సన్న్యాసనామం లేదు. గోవిందపాదులకుంది.


No comments:

Post a Comment