Tuesday 19 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 136 వ భాగం



దేవుడు లేడనే విషయంలో బౌద్ధులతో ఢీకొని తీవ్రంగా వాదించినవాడు ఉదయనుడు, కర్మలు అక్కర్లేదనే విషయాన్ని ఖండించినవాడు కుమారిలుడు.


ఇక శంకరులు చేసిందేమిటి? శంకరుడు, శంకరులుగా అవతరించడానికి ముందే శంకర తనయుడైన కుమారస్వామి, కుమారిలునిగా అవతరించాడు.


మరొక చిత్రం పై వారిద్దరూ శంకరుల పనిని తేలిక చేసారు. ఉదయమునికి ముందున్న న్యాయ సిద్ధాంతాన్ని శంకరులు ఖండించారు. పెక్కు ఆత్మలని న్యాయం అంటుంది. ఉన్నది ఒక్కటే ఆత్మయని అద్వైతం అంటుంది. కనుక దీనినీ ఖండించవలసి వచ్చింది. దీనిని పెద్దగా ఖండించకపోయినా కుమారిలుని మతాన్ని గట్టిగా ఖండించారు. తరువాత సాంఖ్యులను. వారు చెప్పిన పురుష - ప్రకృతి సిద్ధాంతం, మన బ్రహ్మ మాయ వంటిదిగా - కనబడినా వేదాంతానికి భిన్నంగా కనబడడం వల్ల ఖండించారు. అయితే ఇందున్న తత్త్వ విభజనను స్వీకరించారు. అయితే వేదాంతానికి ఎట్లా భిన్నమో చెప్పవలసి వచ్చింది. ఆపైన సాంఖ్యం కేవలం బుద్ధితో సంబంధించినది.


బౌద్ధికం, సామాన్యులలో వ్యాప్తి పొందలేదు. ఇక కర్మానుష్టానం నిత్య జీవితంలో ఉంటుంది కనుక ఎంతవరకూ దీనిని గ్రహించాలనే విషయంలో మీమాంసకులతో పేచీ పడి ఇదే పరమార్ధం కాదని ఖండించవలసి వచ్చింది. ఒక దశలో దీని ఊసు, ఎత్తకూడదని ఆత్మానుభూతియే పరమ గమ్యమని చెప్పవలసి వచ్చింది. శ్రోతస్మార్త కర్మలు అవసరం ఉన్నా అదే పరమార్ధం కాదని చెప్పవలసి వచ్చింది. "


ఒక గాయం తగిలింది, దానికి కట్టు కట్టాం. గాయం మానింది. మానినా ఇంకా కట్టు కట్టుకొని యుండండని అనడం సబబుగా ఉండా? అట్లాగే జ్ఞానావస్థలో కర్మకాండలలో మునగవద్దని శంకరులన్నారు.


No comments:

Post a Comment