Monday 11 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 128 వ భాగం



గురురత్నమాలలోని గోవింద స్తుతిలో ఒకప్పుడు హరితల్పమైనవాడు, భూభారం వహించినవాడు లక్ష్మణునిగా, బలరామునిగా పతంజలిగా అవతరించిన వాడు చంద్రశర్మయై గోవిందముని యైన వానికి జయమగు గాక అనే స్తుతిలో పూర్వాపరాలన్నీ తడుమబడ్డాయి.

"హరితల్ప హరాంఘ్ర నూపురక్ష్మాధర

సౌమిత్రి, బల, అత్రిపుత్ర లక్ష్మా..."


ఆచార్య పరంపర యొక్క విశిష్టత


శంకరుల గురించి తెలుసుకోవాలంటే వారి పూర్వాచార్యులను గురించి తెలుసుకోవాలని ఇదంతా చెప్పాను.


ఒక ఆచార్యుని తరువాత మరొక ఆచార్యుడు అంది పుచ్చుకుంటాడు. ఆత్మజ్యోతి నిరంతరము వెలుగుతూ ఉండవలసిందే. జ్ఞానమనే విద్యుత్తు నిరంతరం ఉంటేనే ఆచార్య పరంపర కొనసాగితేనే ప్రపంచము వెలుగులో ఉన్నట్లుంటుంది. ఒక విద్యుత్ పరికరాన్ని 'ఛార్జి' చేసారని అంటాం. ఆఫీసరు ఒకడు బదిలీ అయి అతని బాధ్యతలను మరొకనికి అప్పజెప్పినపుడు ఛార్జ్ ఇచ్చారని అంటారు. జ్ఞానమనే విద్యుత్తో గురువు, శిష్యుణ్ణి ఛార్జి చేస్తాడు. పీఠాన్ని ప్రతివ్యక్తీ అధిరోహించడానికి వీలు లేదు. తగిన అర్హతలుండాలి. గురుపరంపర నిరంతరమూ సాగుతూ ఉండాలి.


ప్రార్థన - వరము


దక్షిణామూర్తి మఱ్ఱి చెట్టు క్రింద నుండగా కర్మానుష్టానం క్షీణించిందని, దేవతలు మొరపెట్టారు. నారదుడు, ముందుగా బ్రహ్మను సమీపించాడని తరువాత కైలాసానికి దేవతలతో కలిసి వెళ్ళాడని ఒక శంకర విజయంలో ఉంది. అదే ఆనంద గిరీయం. 


No comments:

Post a Comment