Wednesday 20 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 137 వ భాగం



ఇక మండన మిశ్రులు మీమాంసపై గ్రంథం వ్రాసారో లేదో! మీమాంసానుక్రమణిక గ్రంథం వ్రాసినవారు, వీరు కాదని వేరని అంటున్నారు. వారు సన్న్యాసం పుచ్చుకొన్న తరువాత వ్రాసిన గ్రంథాలు లభ్యమౌతున్నాయి.


కర్మవాదుల అవతార కారణం


ముందు వీరెందులకు అవతరించనట్లని సందేహం. బ్రహ్మ - కుమార స్వాములు సురేశ్వరులుగా, కుమారిలభట్టుగా అవతరించారు. పరమేశ్వరునితో దేవతలు కర్మానుస్థానం లోపించిందని అన్నారని విన్నాం. మనమిచ్చే ఆహుతులే దేవతలకాహారం. జ్ఞాన మార్గంలో ఉన్నవాడెట్లాగూ కర్మ చేయడు. కనుక దేవతలు జ్ఞానులంటే ఇష్టపడరు. కర్మిష్ఠులనే కోరుతారు.


కర్మ పూర్తిగా పోయినపుడు తానవతరించి ఏం ప్రయోజనమని, ముందు కొంతకాలం యజ్ఞాలు మొదలైన కర్మకాండ సాగనీ అని శంకరుడు భావించి యుంటాడు.


బౌద్ధులు, జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. మనం ఇప్పుడు వెడితే ఏది వైదిక జ్ఞానమో, ఏది కాదో అనే సందేహం ప్రజలలో కలుగుతుందని ముందుగా వారిని పంపించారు.

ఇంద్రసరస్వతుల అవతారాలు - ప్రభుత్వ సాహాయ్యం లేకుండా శంకరుల కృషి


కొన్ని పుస్తకాలలో ఇంద్రుడు, సుధన్వుడనే రాజుగా వచ్చి కుమారిలభట్టునకు సాయం చేసినట్లుంది. ఇంద్రుడట్లా రావడం, దేవతలకూ ఉపయోగకరమే.


No comments:

Post a Comment