Thursday 14 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 131 వ భాగం



బౌద్ధమత ఖండనలో మీ మాంసకుల సాహాయ్యం


సురేశ్వరులకు, తోటి శిష్యులకు తేడా ఉంది. మిగిలిన ముగ్గురు బ్రహ్మచర్యం నుండే సన్న్యాసం స్వీకరించారు. ఇతడు శంకరుల కంటె వయస్సులో పెద్దవాడు. ఇతడు గృహస్థుడుగా ఉన్నప్పుడు మీమాంసకుడు. అద్వైత ఖండన చేసేవాడు. శంకరుని వాదనా పటిమచే అద్వైతాన్ని స్వీకరించి సన్న్యాసి అయినాడు. గృహస్థుగా నున్నపుడు అతని పేరు మండన మిశ్రుడు. బ్రహ్మయొక్క అంశతో జన్మించినవాడు.


యజ్ఞం కర్మానుష్ఠానానికి చెందింది. యజ్ఞంలో నాల్గు రకాలైన ఋత్విక్కులుంటారు. యజ్ఞాన్ని పర్యవేక్షించే వానిని బ్రహ్మ అని అంటారు. మీమాంసకుడైన ఇతడు, బ్రహ్మాంశతో పుట్టడం బాగానే ఉంది.


మరొక మీమాంసకుడు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతారం కుమారస్వామి అంశతో పుట్టాడు కనుక కుమారిలభట్టుగా వచ్చాడు. అతని సిద్ధాంతానికి భాట్ట మతమనే పేరు. యజ్ఞంలో అగ్నికి ప్రథమస్థానం. అగ్నియే సుబ్రహ్మణ్యుడు. అందుకే కర్మ మీమాంసకు అనుకూలంగా ఉంది. ముందు ఇతడు అద్వైత వేదాంతాన్ని ఎదుర్కొన్నవాడే. చివరకు శంకరుల జ్ఞాన మార్గాన్ని అంగీకరించాడు. అయితే శంకరుల శిష్యుడు కాలేదు. వారి కథ తరువాత చెబుతా.


శంకరులు జ్ఞాన మార్గాన్ని వీరు కర్మ మార్గాన్ని ఎన్నుకొనడమేమిటి? పరస్పరం వాగ్వాదాలేమిటి? వారు దేవతలైనపుడు దేవుడైన శంకరులకు తోడ్పడవద్దా అని శంకిస్తాం.


No comments:

Post a Comment