Saturday 30 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 147 వ భాగం



దుర్వాసుడు, ఆర్యాద్విశతిని రచించాడు. ఈ దేవతా పూజా కల్పాన్ని అందించాడు. మూక పంచశతిలో మొదటి వంద శ్లోకాలనూ ఆర్యాశతకమంటారు. కనుక కంచి అమ్మవారి పేరును, శంకరుల తల్లికి పెట్టగా ఆ పేరునకు, కంచికి సంబంధం ఉంది.


అవతార ప్రదేశం - విశిష్టత


వైదిక మతానుష్టానం ఉన్న కేరళ ప్రాంతం అనుకూలమైనదే. శాస్త్రంలేదు, వేదం లేదని మనం అనుకొంటూ ఉంటే ఈనాటికీ వాటిని రక్షిస్తున్నవారు నంబూద్రీ బ్రాహ్మణులే. సకాలంలో ఉపనయనం, గురుకులానికి పంపడం, బ్రహ్యచర్య దీక్షలు, దండధారణ, కృష్ణాజినం - అంతా నేటికీ ఉంది. ఈనాటికీ ఆంగ్ల విద్య నేర్చుకున్నా కొంతకాలం వేదాభ్యాసం చేస్తూ ఉంటారు. అది ఆ భూమి విశిష్టత. అందుకే వారక్కడ అవతరించారు.


పుణ్య దంపతులు


త్రిచూర్ కి 30 మైళ్ళ దూరంలో కాలడి గ్రామం ఉంది. ప్రక్కనే పూర్ణానది ప్రవహిస్తోంది. శివగురువు తండ్రిపేరు విద్యాధిరాజు. 'పేరు సార్థకం. 


అక్కడ గృహస్థులు సంపన్నులు. ఒక పెద్ద తోటలోనే వారి నివాసం. అది అనేక ఫలవృక్షాలతో ఉంటుంది. అందన్ని పంటలను పండిస్తారు.  

తిండికి లోటుండదు. శివ గురువు తల్లి 'కైపల్లి'కి చెందగా, ఆర్యాంబ మేళపూర్ నకు చెందింది.


1 comment: