Tuesday 26 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 143 వ భాగం



కంచి మఠం - కుంభకోణం


ఒక ప్రాంతంవారు మరొక ప్రాంతం వెళ్ళినా పూర్వ ప్రాంతంపై మక్కువతో ఉండడం, వారి ఊళ్ళ పేర్లను క్రొత్తవాటికి చేర్చడం సహజం. ఆంగ్లేయులు, అమెరికాకు వెళ్ళినా ఆంగ్ల ప్రాంతపు నామానికి కొత్తగా 'న్యూ' చేర్చడం జరిగింది. అమెరికాలో కొంత ప్రాంతాన్ని న్యూ ఇంగ్లాండ్ అంటారు. యార్క్, జెర్సీ వంటివి న్యూయార్క్, న్యూజెర్సీగా అమెరికాలో మారాయి. అట్లాగే ఆస్ట్రేలియాకు వెళ్ళిన ఆంగ్లేయులు వారి వేల్స్ ని న్యూ సౌత్ వేల్స్ గా మార్చారు. అట్లాగే తమిళ దేశం నుండి వచ్చినవారి నల్ల కణ్ణనూర్, మలయాళంలో కన్ననోర్; పళూర్, పళు పురుగా మారింది. శంకరుల జన్మస్థలం, శివపురం, త్రిచూర్ గా ఎట్లా మారిందో తరువాత వివరిస్తాను.

కాంచీపురంలోని మా మఠం, 18వ శతాబ్దంలో కుంభకోణానికి మారింది. ఆర్కాట్ నవాబ్, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచివారు, హైదరాలీ యుద్ధాలతో కాంచీపురం అల్లకల్లోలంగా ఉండేది. 62వ పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతీ స్వామివారు మఠాన్ని అక్కడికు మార్చారు.


రామేశ్వరం తీర్థయాత్రకు వెడుతూ ఉడయార్ పాలయంలో స్థిరపడ్డారు. అక్కడి జమీందారులు స్వామిని అక్కడే ఉండిపొమ్మని అన్నారు. అది సురక్షిత ప్రాంతం. కంచి కామాక్షి మఠం, మా మఠం యొక్క ఆధీనంలో ఉండేది. అందున్న స్వర్ణ కామాక్షి విగ్రహాన్ని రక్షించడం కోసం అక్కడే ఉండిపోవలసి వచ్చింది.


అంతేకాదు, చిదంబరంలోని నటరాజ విగ్రహం, కంచిలోని వరద రాజస్వామి యొక్క ఉత్సవమూర్తి; శ్రీరంగంలోని రంగరాజ ఉత్సవమూర్తిని తరలించవలసి వచ్చిన కాలమది. పరిపాలించేవారు రాజులైనా, విదేశీయుల భయం వల్ల ఇట్లా జరిగింది. భగవంతుడు తన శక్తి కోల్పోవడం వల్లకాదు. ప్రజలు మతంమీద నిరాదరణ, అనాసక్తే ఈ పరిస్థితులకు దారితీసింది. మన నిర్లక్ష్యమే కారణమని మనకొక గుణపాఠం భగవానుడు నేర్పాడని అనిపిస్తుంది.


స్వర్ణ కామాక్షి కాదు. నటరాజు, త్యాగరాజు, రంగరాజు, వరద రాజులకు కూడా ఆ ఉడయార్ పాలెం నిలయమైంది. అక్కడి రాజులు భక్తి ప్రపత్తులతో వాటిని రక్షించారు.


No comments:

Post a Comment