Friday 29 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 146 వ భాగం



కుంభకోణం దగ్గరగా నున్న శివపురంలోని బ్రాహ్మణులు, త్రిచూర్ వచ్చి యుంటారు. శంకరుల తాతగారైన విద్యాధి రాజు, తమిళనాడులోని శివ పురస్వామియైన గురుపదాన్ని తన కొడుకునకు పెట్టి యుంటాడు. ఇట్లా తమిళ సంబంధం కుదురుతుంది.


సృష్టికి కారణమైన అమృత కుంభం ఉన్నచోటు కనుకనే అది కుంభకోణమైంది. అట్టి క్షేత్రం నుండి శంకరుల పూర్వులు, కేరళకు వచ్చి యుంటారు.


అందువల్ల కంచి నుండి మా మఠం, రెండవ పట్టణానికి మారవలసి వచ్చినప్పుడు కుంభకోణానికి ఆ బహుమతి లభించింది అని నాకు తోచింది. కుంభకోణానికున్న ఖ్యాతి ఒక కారణమై ఉంటుందనిపిస్తుంది. రాముడు సూర్య వంశానికి చెందినట్లు ఆచార్యులవారి పూర్వీకులు కుంభకోణానికి చెందినవారు. 


కంచిలో శంకరులు, సిద్ధిని పొందగా కుంభకోణం వారికి ఒకవిధంగా కారణమైనట్లు ఊహిస్తున్నా.


తల్లియైన ఆర్యాంబ విశేషం చూద్దాం. శబరిమలై స్వామిని, శాస్తయని అంటారు. అతడే ఆర్యన్. తమిళనాడులో ఈ స్వామిని అయ్యనార్ అంటారు. ఈ అయ్యప్ప ద్రావిడ దేవతయనడం తెలివి తక్కువ.


అమ్మవారికి ఆర్య అని పేరు ఉంది. త్రిపుర సుందరియే ఆర్య. కామాక్షి, మహాత్రిపుర సుందరి కదా. ఆమెయే లలిత.


No comments:

Post a Comment