Tuesday 12 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 129 వ భాగం



శ్రుత్యాచారం (వేదాచారం) పోయి మిథ్యాచారం ప్రబలిందని అన్నాడు:


"శ్రుత్యాచారం పరిత్యజ్య మిథ్యాచారం సమాశ్రితః" ఒక మూల బౌద్ధులు వేదాలను, కర్మానుష్ఠానాన్ని వర్ణాశ్రమ విభజనను ఖండిస్తున్నారని, యజ్ఞభూమిలో యోగులంటే చెవులు మూసుకుంటున్నారని, మరొక మూల వైదిక పద్ధతులను విసర్జించి శైవ వైష్ణవులు, లింగ ముద్ర చక్ర ముద్రలు వేయించుకుంటున్నారని, ఇక కాపాలికులు తలలు కోసుకుంటున్నారని నీవవతరించి వేద మార్గాన్ని స్థాపించ వలసిందిగా వారు వేడుకున్నారు.


'వర్త్మ స్థాపయతుశ్రోతం, జగత్ యేన సుఖం ప్రజేత్'


అని ప్రార్థించినట్లు మాధవ శంకర విజయంలో ఉంది. (ఇది విద్యారణ్యులు వ్రాసినది కాదని చారిత్రకులంటారు). అవతరిస్తానని ఆయన మాట ఇచ్చాడు.


బ్రహ్మమొక్కటే అనే దానిని మరిచారని, జీవులు, బ్రహ్మము కంటె భిన్నులనే అజ్ఞానంలో ఉన్నారని, మాయ వల్ల ద్వైత జ్ఞానంలో ఉన్నారని, ఒకయతీంద్రునిగా అవతరిస్తానని పరమేశ్వరుడన్నాడని ఉంది. నేను నల్గురు శిష్యులతో మహావిష్ణువు యొక్క నాల్గు చేతులు మాదిరిగా అవతరిస్తానని అన్నాడు. దుష్టాచారాలను పోగొట్టడానికి, ధర్మస్థాపన చేయడం కోసం సూత్ర భాష్యాన్ని వ్రాసి వేదాంత తాత్పర్యం, అద్వైతమేయని ప్రతిపాదిస్తానని అజ్ఞానమనే చీకటిని పారద్రోలుతానని అన్నట్లుంది.


No comments:

Post a Comment