Saturday 23 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 141 వ భాగం



వీరిలో చోళ దేశం నుండి వచ్చినవారెందరో ఉన్నారు. తెలుగులో ఇల్లును, కన్నడంలో మన అంటారు. తమిళంలోనూ ఇల్లం, మనై మాటలు యున్నాయి. అందుకే నంబూద్రీలు మేము ఫలానా ఇల్లం లేదా ఫలానా మనాకు చెందిన వాళ్ళం అంటారు. ఆచార్యులు 'కయిపల్లిమనా'కు చెందినవారు.


వీరు ఆదివాసి జనులతో కలిసి యుండడం సగం తమిళం, సగం సంస్కృతం, దేశీయ పదాలతో మలయాళ భాష ఉంటుంది.


వేయి లేక 1500 సంవత్సరాలనుండి ఈ భాష ప్రచారంలో ఉంది. ఒక రాష్ట్రంలో వ్యవసాయం, వర్తకం, రకరకాల వృత్తులుండాలి. తమిళులలో బ్రాహ్మణేతరులు ప్రవేశించడం వల్ల వర్తక వాణిజ్యాలు వృద్ధి పొందాయి. తమిళ దేశపు చేరరాజుల ప్రభావం ఉండడం వల్లనే ఇక్కడ వైదిక సంస్కృతి వ్యాపించింది.


సుఖ జీవులైన తమిళ బ్రాహ్మణులు కొంతమంది తమ రాష్ట్రానికి వెళ్ళినా కన్నడ, తెలుగు బ్రాహ్మణులిక్కడ ఉండి పోయారు. పరశురాముడనేక క్షేత్రాలనేర్పాటు చేసాడు. తమిళ బ్రాహ్మణులు కేరళ రాష్ట్ర సరిహద్దులలో అనగా పాల్కాడ్, తిరువనంతపురంలలో స్థిరపడ్డారు.


అశోకుని శాసనాలలో కేరళ ప్రస్తావింపబడిందని చరిత్రకారులంటారు. తిరుమురైని కీర్తించిన చేరమాన్ పెరుమాళ్ నాయనార్ ప్రబంధాన్ని కీర్తించిన కులశేఖర పెరుమాళ్ రాజులు కేరళలో ఎందరో ఉండేవారు.


No comments:

Post a Comment