Sunday 10 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 127 వ భాగం



పతంజలి చరితంలో ఆదిశేషుని నుండి మొదలై గౌడపాద, గోవిందుల కథ వరకూ ఉంటుంది. శంకరుల కథ సూక్ష్మంగా చెప్పబడింది. ఎనిమిదవ సర్గలో, రామభద్ర దీక్షితులు, పూర్వాచార్యుల గురించి విపులంగా వ్రాసేరు. ఇక అనేక శంకర విజయాలలో శంకరుల చరిత్ర విపులంగా ఉంది. కనుక సంక్షేపించాడు. వీరి పుస్తకంలో మొసలి శంకరుల కాలును పట్టుకోవడంతో మొదలౌతుంది. కంచిలో శంకరులు చివరి కాలంలో ఉన్నట్లు వ్రాసేడు.


"గోవింద దేశికం ఉపాస్య చిరాయ భక్త్యా 

తస్మిన్ స్థితే నిజమహిమ్ని విదేహ ముక్త్యా 

అద్వైత భాష్యం ఉపకల్ప్య దినోవిజిత్య 

కాంచీపురే స్థితిం అవాపస శంకరార్యః


ఈ శ్లోకంలో శంకరులు గురువుకై వెదకడం, ఉపదేశాన్ని పొందడం, కాశీకి వెళ్ళడం, భాష్య రచన, దేశం నలుమూలలా తిరగడం చివరకు కంచిలో ఉన్నట్లు సూక్ష్మంగా చెప్పబడింది.


నర్మదా తీరంలో గురువుదగ్గర శంకరులు చాలాకాలం ఉండలేదు. గోవిందులు తాము వచ్చిన పనియై పోయిందని విదేహ ముక్తి పొందారు. తరువాత శంకరులు గురువయ్యారు. మరొక కథ కూడా ఉంది. జగదాచార్యులుగా దిగ్విజయం చేసారని, కైలాసానికి వెళ్ళారని, పరమ శివుని నుండి పంచలింగాలను పొందారని, గోవిందులను దర్శించుకొని దక్షిణామూర్తి అష్టకం వ్రాసేరని ఉంది. పతంజలి చరితం ప్రకారం గోవిందులు ముక్తిని పొందిన తరువాతే శంకరులు ఆచార్యత్వాన్ని వహించినట్లుంది. భాష్యాలను వ్రాసి కంచిలో ఉన్నట్లుంది. 


No comments:

Post a Comment