Wednesday 13 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 130 వ భాగం



"దుష్టాచార వినాశాయ, ధర్మ సంస్థాపనాయచ 

భాష్యం కుర్వన్ బ్రహ్మసూత్ర తాత్పర్యార్థ వినిర్ణయం 

మోహన ప్రకృతి ద్వైతధ్వాంతం అధ్యాత్మ భానుభిః 

చతుర్భిః సహితం శిష్యైః చతుర్భిః హరివత్ భుజైః 

యతీంద్ర శంకరో నామ్నా భవిష్యతి మహీతలే"


యమ, యతి పదాలకు ధాతువొక్కటే. అణచుటయనే అర్థం. యముడు జీవులను శిక్షిస్తాడు. యతి, ఇంద్రియాలను, మనస్సును అణచేస్తాడు. యముని కర్మ, క్రూరంగా కన్పిస్తుంది. జ్ఞానంతో యతి అణుస్తాడు. కనుక యతి కూడా యముడే. దీనికి 'సం' అనే ఉపసర్గ చేర్చబడి సంయమి అయింది. అందుకే సన్న్యాసులను సంయములని అంటారు.


ఈ అవతరించుటలో దేవతలకూ తగు ప్రాధాన్యం ఉంది.


త్రిపురాసుర సంహారంలో దేవతలందరూ శంకరునకు సాయం చేస్తామని వివిధాయుధాలతో వచ్చారు. అన్నిటినీ ఇతడుపయోగించుకున్నాడా? ఒక నవ్వు నవ్వాడు. అదే అగ్నియై త్రిపురాసురులను భస్మీపటలం చేసింది. అట్టి లీలలను ప్రదర్శించిన భగవానుడు మరొక లీలను ప్రదర్శించపబోతున్నాడు. ఒక శంకర విజయంలో దేవతలకూ తగిన పాత్ర ఇచ్చినట్లుంది.


రామాది అవతారాలలో దేవతలు తమ వంతు పాత్రను పోషించారు.


శంకరుడు ఈ అవతారంలో నలుగురు శిష్యులు కావాలనుకున్నాడు. అందుచేత పద్మపాదుడు విష్ణ్వంశతో, హస్తామలకుడు వాయ్వంశతో; తోటకుడు అగ్న్యంశతో, సురేశ్వరుడు బ్రహ్మాంశతో అవతరించారు. బ్రహ్మతో సరస్వతి కూడా వచ్చింది. ఈ అవతారంలో ఆమె పేరు సరసవాణి. ఇంద్రుడు, సుధన్వుడనే రాజయ్యాడు. సుధన్వుడు కుమారిలునితో, సరసవాణి, సురేశ్వరునితో సంబంధం కల్గియుంది. వీరిని గురించి కూడా 

చెప్పుకోవాలి.


No comments:

Post a Comment